RGV: ‘పునీత్‌ లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’: రామ్‌గోపాల్‌ వర్మ

నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరన్న విషయాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.

Published : 29 Mar 2022 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరన్న విషయాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తన కొత్త చిత్రం ‘మా ఇష్టం’ ప్రచారంలో భాగంగా బెంగళూరు వెళ్లిన ఆయన పునీత్‌ ఘాట్‌ను సందర్శించారు. పునీత్‌ సమాధికి నివాళులర్పించి, ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ చిత్ర షూటింగ్‌ సమయంలో పునీత్‌ను పలుమార్లు కలిసినట్టు తెలిపారు. పునీత్‌ మరణించినా ప్రేక్షకుల హృదయాల్లో హీరోగానే ఉన్నాడని కొనియాడారు. పునీత్‌ ఆఖరి చిత్రం ‘జేమ్స్‌’ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. నివాళి అర్పించిన వారిలో రామ్‌గోపాల్‌ వర్మతోపాటు కథానాయికలు అప్సరరాణి, నైనా గంగూలీ ఉన్నారు. సంబంధిత ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. నటుడిగానే కాకుండా మంచి మనిషిగా ఎందరో హృదయాల్లో నిలిచిన పునీత్‌ హఠాన్మరణం (గతేడాది అక్టోబరు) చెందడాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని