ETV Win: ఈటీవీ విన్‌లో ‘ఏం చేస్తున్నావ్‌?’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

ఈటీవీ విన్‌ ప్రేక్షకులను అలరించేందుకు మరో యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వచ్చేస్తోంది. 

Published : 12 Mar 2024 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 14 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. 

కథేంటంటే..

బీటెక్‌ పూర్తిచేసిన సాయి (విజయ్‌ రాజ్‌కుమార్‌) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. అతడి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. అందరిలాగే తన కుమారుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆయన కోరిక. కానీ, సాయికి మాత్రం ఉద్యోగంపై ఆసక్తి ఉండదు. దీంతో అతడిని ఇంటి చుట్టుపక్కల వారంతా ‘ఏం చేస్తున్నావ్‌’ అని అడుగుతుంటారు. ఈ సమయంలోనే సాయికి నక్షత్ర (నేహా పటాని) పరిచయమవుతుంది. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. నక్షత్ర వాళ్లింట్లో సాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు. వాళ్ల బిజినెస్‌ చూసుకోవాలని కోరతారు. కానీ, కొన్ని కారణాల వల్ల నక్షత్రకు సాయి బ్రేకప్‌ చెబుతాడు. అలా ఎందుకు చేశాడు. అతడి కెరీర్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నదే మిగిలిన కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని