Gamanam: అలా అరిచే సరికి షాకయ్యా..!
‘‘పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే ఈ ‘గమనం’’ అన్నారు దర్శకురాలు సుజనా రావు. ఆమె తెరకెక్కించిన తొలి చిత్రమిది. శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు పరిపూర్ణమైన జీవన ప్రయాణం గురించి చెప్పే సినిమానే ఈ ‘గమనం’’ అన్నారు దర్శకురాలు సుజనా రావు. ఆమె తెరకెక్కించిన తొలి చిత్రమిది. శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడారు సుజనా రావు.
‘‘నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చిన సంఘటనల స్ఫూర్తితోనే నేనీ కథ రాసుకున్నా. ఇందులో మూడు నాలుగు కథలుంటాయని కాదు. ఓ పరిపూర్ణమైన జీవన చక్రాన్ని ఇందులో చూపించాలని అనుకున్నా. ఈ కథను తొలుత ఓ డ్రాఫ్ట్లా రాసుకున్నా. దాన్ని నిర్మాత జ్ఞానశేఖర్ సర్కు పంపాను. ఆయనకది బాగా నచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని చిన్నగానే తీయాలనుకున్నాం. కానీ, ఒకొక్కరిగా అగ్ర తారలందరూ వచ్చి చేరడంతో పెద్ద సినిమాగా మారిపోయింది’’.
* ‘‘ఈ కథని శ్రియా వద్దకు తీసుకెళ్లే వరకు నా కమల ఆమె అని తెలియదు. సగం కథ చెప్పిన తర్వాత తనే నా కమల అని నిర్ణయించుకున్నాను. ఆమె కథ మొత్తం విన్నాక.. అలా లేచి నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు. ఇందులో శివ కందుకూరి క్రికెటర్ అవ్వాలనుకునే అలీ అనే కుర్రాడిగా కనిపిస్తారు. అతన్ని ప్రేమించే యువతిగా ప్రియాంక కనిపిస్తుంది. నిత్యామేనన్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. వీటిలో ప్రతీ పాత్రకు ఓ జర్నీ ఉంటుంది’’.
* ‘‘నా కలలకు మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. నాన్న జి.పద్మారావు మాజీ నిర్మాత. చిన్నప్పుడు ఆయనతో కలిసి షూటింగ్లకు వెళ్లేదాన్ని. ఆ ఇష్టంతోనే ఓవైపు దిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటూ.. మరోవైపు డాక్యుమెంటరీలు తీయడం మొదలు పెట్టా. ఇప్పుడీ చిత్రంతో దర్శకురాలిగా తెరపై మెరుస్తున్నా. నా తదుపరి చిత్రం కోసం ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసుకున్నా. త్వరలో వివరాలు తెలియజేస్తా’’.
‘‘ఈ చిత్రం కోసం ఇళయరాజా కావాలని అడిగినప్పుడు నిర్మాతలు షాకయ్యారు. నేను ఆయనకు కథ చెప్తుండగా.. ‘హే ఆపు’ అన్నారు. ఆయనలా అరిచే సరికి చాలా షాకయ్యా. తర్వాత నా పక్కన వచ్చి కూర్చొని... ‘ఓ ఫొటో తీయండి.. మేం సినిమా చేయనున్నామ’న్నారు. ఇందులో తక్కువ మాటలే ఉన్నా.. ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు సాయిమాధవ్ బుర్రా సర్కు చాలా థ్యాంక్స్’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..