సంక్షిప్త వార్తలు(6)
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం ఖరారైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.
కొత్త కబురు వచ్చేసింది
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం ఖరారైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కొత్త దర్శకురాలు వైష్ణవి తెరకెక్కించనున్నారు. ఈ కొత్త సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. సిద్ధు ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్నారు. ‘డీజే టిల్లు’కు రీమేక్గా రూపొందుతున్న సినిమా ఇది.
మహిళలకు ఉచితం
సుహాస్ కథానాయకుడిగా షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. టీనా శిల్పరాజ్ కథానాయిక. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఎవరి కోసం చేశామో.. వారికి చేర్చాలనే ఉద్దేశంతో నిర్మాతలు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాని ఆడవాళ్లకు ఉచితంగా చూపించనున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశించిన థియేటర్లలో బుధవారం ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తున్నాం. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమ, శరత్, అనురాగ్, షణ్ముఖ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
దేశ భక్తి నేపథ్యంలో..
రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దేశం కోసం’. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘దేశ భక్తి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో రవీంద్ర 14మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలు వేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
‘సిఎస్ఐ సనాతన్’ వచ్చేస్తున్నాడు
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శివశంకర్ దేవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అజయ్ శ్రీనివాస్ నిర్మాత. మిషా నారంగ్ కథానాయిక. నందిని రాయ్, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు. ‘‘ఇదొక భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. విక్రమ్ అనే పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు క్రైమ్ సీన్ ఆఫీసర్ ఆది ఏం చేశారు? ఆ కేసు విషయంలో ఆయనకెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది చిత్ర కథాంశం. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: అనీష్ సోలోమాన్.
అక్షయ్తో మృణాల్ ఆటాపాటా
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. తాజాగా ఆయన ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘సెల్ఫీ’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’కు రీమేక్ ఇది. తాజాగా ఈ చిత్రంలోని ‘కుడియే నీ తేరి’ అనే కొత్త పాట టీజర్ను విడుదల చేశారు. ఈ పాటలో మృణాల్ అతిథి పాత్రలో నటించింది. పూర్తి పాట ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో డయానా పెంటీ, నుష్రత్ బరూచ ముఖ్యపాత్రల్లో నటించారు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ని, ‘మై ఖిలాడీ తు అనారీ’ గీతాన్ని విడుదల చేశారు.
యాక్షన్ థ్రిల్లర్.. హెబ్బులి
కిచ్చ సుదీప్, అమలాపాల్ జంటగా ఎస్.కృష్ణ తెరకెక్కించిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఈ సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత సి.సుబ్రహ్మణ్యం. ఇది ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో మంగళవారం చిత్ర పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ‘‘అన్ని రకాల వాణిజ్య హంగులున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. కన్నడలో భారీ వసూళ్లు సాధించింది. అందుకే ఫ్యాన్సీ రేటుతో తెలుగు డబ్బింగ్ హక్కులు కొన్నాము. ఈ చిత్రం తెలుగులోనూ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?