Tollywood: మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు..
అగ్రతారల నుంచి యువతారల వరకూ ఇదేమాట
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే గ్రాఫిక్స్ హంగులు.. సాహసోపేతమైన విన్యాసాలతో కట్టిపడేసే హీరోయిజం.. ఇలా ఎన్నో వాణిజ్య హంగులకు చిరునామాగా నిలిచే చిత్రాలివి. అందుకే వీటికి పాన్ ఇండియా స్థాయిలోనే కాక ప్రపంచవ్యాప్తంగానూ మంచి గిరాకీ ఉంటుంది. నిజానికివి భారీ బడ్జెట్లను డిమాండ్ చేసే కథలైనా సరే.. ప్రేక్షకుల మెప్పు పొందాయంటే చాలు అంతకు రెట్టింపు వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ తరహా ఫాంటసీ థ్రిల్లర్లతోనే బాక్సాఫీస్ ముందు జోరు చూపించేందుకు పలువురు తారలు సిద్ధమవుతున్నారు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకోగా.. మరికొన్ని పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన సినిమాల్లో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ల వాటానే ఎక్కువ. ‘బంగార్రాజు’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘హను-మాన్’, ‘ఊరు పేరు భైరవకోన’.. ఇలా అనేక విజయాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడీ తరహా కథలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు పలువురు అగ్రతారలు సిద్ధమవుతున్నారు. చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే సోషియో ఫాంటసీ చిత్రాల్లో ‘అంజి’కి ప్రత్యేకమైన స్థానముంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ, ఆ తర్వాత చిరు నుంచి మళ్లీ ఆ తరహా సినిమా రాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ‘విశ్వంభర’ రూపంలో మరో సరికొత్త ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ‘బింబిసార’తో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పంచభూతాలతో ముడిపడి ఉన్న కథగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ముల్లోకాలతో ముడిపడిన అంశాలు ఉంటాయని టాక్. దీనికోసం ఓ ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. అవన్నీ సినీప్రియులకు కొత్త అనుభూతి పంచిస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కల్కి 2898ఏడీ’ అనే సైన్స్ ఫిక్షన్ చిత్రంతో త్వరలో సినీప్రియుల్ని పలకరించనున్నారు ప్రభాస్. ఇక ఆ తర్వాత ఆయన నుంచి రానున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఓ విభిన్నమైన రొమాంటిక్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్గానే ఉండనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం మారుతి కూడా తనదైన శైలిలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఈ జానర్లోనే సూపర్ హీరో..
ప్రస్తుతం ‘తండేల్’ చిత్రం కోసం సెట్స్పై తీరిక లేకుండా శ్రమిస్తున్నారు హీరో నాగచైతన్య. ఆయన తదుపరి సినిమా కార్తీక్ దండుతో ఖరారైన సంగతి తెలిసిందే. ఇది కూడా కార్తీక్ తొలి చిత్రం ‘విరూపాక్ష’ తరహాలోనే ఫాంటసీ అంశాలతో నిండిన మిస్టీక్ థ్రిల్లర్గా ఉండనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఆధ్యాత్మికతకు సైన్స్ను ముడిపెట్టి చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫాంటసీ థ్రిల్లర్కు కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ రానుంది. దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. రెండో భాగం కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ మూడో భాగం కొనసాగనుంది.
‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ‘మిరాయ్’ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సూపర్ యోధ సినిమాలోనూ ఫాంటసీ అంశాలకు ప్రాధాన్యమున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్తో అర్థమైంది. ప్రస్తుతం ‘హను-మాన్’కు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆ తర్వాత ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాలన్నీ ఈ ఫాంటసీ జానర్లోనే సాగనున్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ఓ కొత్త కబురు బయటకొచ్చింది. కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. ఇది కిష్కిందపురి అనే ఓ ఫాంటసీ ప్రపంచంలో సాగే హారర్ మిస్టరీ కథగా ఉంటుందని సమాచారం. దీని చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్