Akshay Kumar: 500మంది డ్యాన్సర్లతో వెల్‌కమ్‌ ఆటాపాటా

బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

Updated : 24 Apr 2024 11:59 IST

బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో 500మంది డ్యాన్సర్లతో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ‘‘మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త గీతాన్ని తీర్చిదిద్దుతుంది ‘వెల్‌కమ్‌’ చిత్రబృందం. ఏకంగా 30మంది నటీనటులు ఈ పాటలో ప్రత్యేకంగా ఆడిపాడనున్నారు. దీనికి గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెలాఖరున ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది. 500 మంది బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్యర్లతో అక్షయ్‌ కుమార్‌ వేసే స్టెప్పులను చూడడానికి సిద్ధంగా ఉండండి’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దిశా పటానీ, రవీనా టాండన్‌, సంజయ్‌ దత్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 20న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని