‘అల.. వైకుంఠపురములో..’ సరికొత్త రికార్డ్‌..!

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ సినిమా ఆల్బమ్ తాజాగా  1 బిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో...

Published : 16 May 2020 12:20 IST

ట్వీట్ చేసిన గీతాఆర్ట్స్‌

హైదరాబాద్‌: అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ సినిమా ఆల్బమ్ తాజాగా  1 బిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ సోషల్‌మీడియా వేదికగా సంగీత అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ‘మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన సంగీత ప్రియులకు ధన్యవాదాలు. ‘అల.. వైకుంఠపురములో..’ ఆల్బమ్‌ యూట్యూబ్‌‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. నటీనటులు, గాయనీగాయకులు, పాటల రచయితలు, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు’ అని గీతాఆర్ట్స్‌ ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని పలు పాటలకు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ‘బుట్టబొమ్మా’ సాంగ్‌కు టిక్‌టాక్‌ చేసి అలరించగా.. ఇటీవల అలనాటి తార సిమ్రాన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం ‘బుట్టబొమ్మా’ స్టెప్పులతో మెప్పించారు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. పూజా హెగ్డే కథానాయిక. గీతాఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని