ప్రతిసారీ అలా షాక్ ఇవ్వాల్సిందే!
ఉరిమే ఉత్సాహం అనే మాటకి ప్రతీక... యువ కథానాయకుడు రామ్. తెరపై ఆయన జోరు చూస్తే... ప్రేక్షకుడిలోనూ అంతే హుషారు వచ్చేస్తుంది. నచ్చింది చేయడాన్ని ఇష్టపడే రామ్, తనకి నచ్చిన సినిమా రంగంలోనే కెరీర్ని...
ఉరిమే ఉత్సాహం అనే మాటకి ప్రతీక... యువ కథానాయకుడు రామ్. తెరపై ఆయన జోరు చూస్తే... ప్రేక్షకుడిలోనూ అంతే హుషారు వచ్చేస్తుంది. నచ్చింది చేయడాన్ని ఇష్టపడే రామ్, తనకి నచ్చిన సినిమా రంగంలోనే కెరీర్ని మలుచుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న రామ్, త్వరలో ‘రెడ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా రామ్తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...
లాక్డౌన్ తర్వాత జీవితం ఎలా ఉంది?
కొత్తగా ఏమీ అనిపించడం లేదు. నాకు ఇంట్లో గడపడమే ఇష్టం. ఉదయాన్నే లేవటం, నా పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి టీవీ చూడటం..అంతే. ఇప్పుడు ఇంతకంటే చేసేదేం లేదు కదా. అయితే ఈ సమయంలో చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవ్వరం ఊహించని విచిత్ర పరిస్థితి ఇది.
అలా ఇబ్బంది పడుతున్నవాళ్లకి మీ సలహా ఏమిటి?
మనకి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. కరోనా కారణంగా ఎవరి స్థాయిలో వాళ్లు ఇబ్బందులు పడుతున్నాం. అలాగని నెగిటివిటీనే చూడకూడదు. ఇందులో పాజిటివిటీని కూడా వెతకాలి. ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం కాబట్టి, ఇప్పుడు దొరికిన ప్రశాంతతని ఆస్వాదించాలి.
పుట్టినరోజు అంటే చిన్నప్పుడు ఆసక్తిగా ఉండేది. కొంచెం పెద్దయ్యాక ‘మనం పుట్టినందుకు మనం ఆనందపడకూడదు. మన చుట్టుపక్కలవాళ్లు ఆనందపడాలి’ అని ఎక్కడో చదివా. అప్పట్నుంచి సంబరాలు చేసుకోవడం మానేశా. హీరో అయ్యాక, అభిమానులు సందడి చూసి చిన్న ఆనందం కలిగింది. అప్పట్నుంచి వాళ్ల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటా’’.
లాక్డౌన్తో ‘రెడ్’ విడుదల ఆగడం నిరాశపరిచిందా?
సినిమా ఈ రోజు కాకపోతే రేపు విడుదలవుతుంది. కానీ కరోనా సమాజంపై చాలా ప్రభావం చూపింది కదా. దీనివల్ల చాలామందికి తిండి కూడా దొరకడం లేదు. సినిమాలతో మాకు నష్టం వచ్చినా మరో సినిమా నుంచి రాబట్టుకుంటాం. ముందు సమాజం బాగుండాలి.
‘రెడ్’ కోసం ఓటీటీ సంస్థలు ప్రయత్నాలు చేశాయట?
కొన్ని మంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే. కానీ థియేటర్లలోనే విడుదల చేస్తాం. అక్కడి అనుభవం వేరు కదా. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మాస్ అంశాలు ఉన్నాయి. అవన్నీ థియేటర్లలో చూస్తేనే కిక్ ఉంటుంది.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ చేయడానికి కారణం?
‘ఇస్మార్ట్ శంకర్’కి ముందే ఇక నుంచి ప్రయాణం భిన్నంగా ఉండాలనుకున్నా. ‘ఇస్మార్ట్..’ తర్వాత కూడా మళ్లీ ప్రేమకథలు చేయాలనిపించలేదు. ‘రెడ్’ కథ అయితే కొత్తగా ఉంటుందనిపించింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. ‘ఇస్మార్ట్...’ చూసి రామ్ ఇలా చేశాడేంటి? అని ప్రేక్షకులు షాక్ అయ్యారు. అలా ప్రతి సినిమాకీ షాక్ ఇస్తే బాగుంటుంది కదా (నవ్వుతూ).
మనతో మనం గడపడం అవసరం. మనల్ని మనం ఆస్వాదించకపోతే ఇంకెవ్వరినీ ప్రేమించలేం. ఒంటరిగా గడపడమంటే నాకు ఇష్టం. మొన్నటిదాకా కుటుంబంతోపాటే ఉండేవాణ్ని. ఈమధ్యే కొత్త ఇంట్లోకి మారాను. అక్కడ ఒక్కడినే ఉంటున్నాను. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చి వెళుతుంటారు. సినిమా పూర్తయ్యాక విదేశాలకి వెళుతుంటా. ఎక్కడికి వెళ్లాలనేది ముందుగా ప్లాన్ చేసుకోను. ఎయిర్పోర్ట్కి వెళుతూ వెళుతూ దారిలో ఏదో ఒక ప్రదేశం అనుకుని టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా చేస్తున్నప్పుడు సినిమా తప్ప మరో విషయం గుర్తుండదు.
లుక్ పరంగానూ మీలో మార్పు కనిపిస్తోందే..?
ప్రతి సినిమాలోనూ హీరో మంచివాడిగా కనిపిస్తుంటాడు. దాంతో మంచితనం అంటే చిరాకు వచ్చేసింది. ఒక నటుడిగా కంటే ప్రేక్షకుడిగా నాలో ఒక రకమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంతోనే పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్లా. ‘ఇప్పటిదాకా చేయందేదో చేయాలి మనం’ అని చెప్పా. ‘నువ్వు లవర్ బాయ్ కాదు, నువ్వు ఇదీ. నిన్ను ఎవ్వరూ అలా వాడలేదు, నేను వాడతా’ (నవ్వుతూ) అంటూ ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ చేశారు.
పూరితో ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు?
ఆయనొక అద్భుతమైన దర్శకుడు. వ్యక్తిగా ఇంకా నచ్చుతారు. ఆయనలా బతకడం నేర్చుకుంటే చాలు. చిన్న విషయాల్లోనూ సంతోషాన్ని వెతుక్కుంటారు.
కిషోర్తిరుమలతో ఇది మీకు మూడో చిత్రం?
దర్శకుడు కిషోర్ మా కుటుంబంలో ఒక భాగం. మా నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు చేశారు, రెండు సినిమాలకి రచయితగా పనిచేశారు. ‘నేను శైలజ’లో తను నన్ను కొత్తగా చూపించారు. ‘రెడ్’ రీమేక్ అయినా తన ఆలోచనలతో కొత్తగా తీర్చిదిద్దారు.
మీ సినీప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే ఏమనిపిస్తుంది?
నేను ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంటా. నేను బాగా ఆస్వాదించే కథల్ని ఎంపిక చేసుకునేవాణ్ని. నెమ్మదిగా అభిమాన గణం పెరిగింది కాబట్టి ఇప్పుడు నాతోపాటు వాళ్ల ఇష్టాల గురించి కూడా ఆలోచిస్తుంటా. ‘దేవదాస్’, ‘జగడం’ నుంచీ మాస్, క్లాస్ మేళవింపుగా సినిమాలు చేశాను. ఒక్కో దర్శకుడు ఒక్కో కోణంలో నన్ను ఆవిష్కరించడం నాకు బాగా సంతృప్తినిచ్చే విషయం.
పాన్ ఇండియా చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
హిందీలో డబ్ అయిన నా సినిమాలకు వరుసగా వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తమిళం నుంచి కూడా ఎప్పట్నుంచో అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పక్కాగా ఉంటుందనిపిస్తేనే పాన్ ఇండియా తరహా సినిమాలు చేస్తాను.
మీ పెళ్లి ఎప్పుడు?
ప్రస్తుతానికి ఇలా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది (నవ్వుతూ). ప్రేమ, పెళ్లి మన చేతుల్లో ఉండవు. కాబట్టి అవన్నీ జరగాల్సిన సమయం వస్తే జరిగిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి