విజయశాంతి కీలక ట్వీట్‌

ఎందరో అగ్రకథానాయకుల సరసన నటించి అభిమానులచేత రాములమ్మగా, లేడీ సూపర్‌స్టార్‌గా అభిమానుల చేత ప్రశంసించబడిన నటి విజయశాంతి. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ఇటీవల మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు..

Published : 03 Feb 2020 12:11 IST

ఇప్పటికి ఇక సెలవు అంటున్న నటి

హైదరాబాద్‌: ఎందరో అగ్రకథానాయకుల సరసన నటించి అభిమానుల చేత రాములమ్మగా, లేడీ సూపర్‌స్టార్‌గా ప్రశంసలు అందుకున్న నటి విజయశాంతి. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విజయశాంతి సోషల్‌మీడియా వేదికగా ఓ కీలకమైన ట్వీట్‌ పెట్టారు.

‘‘సరిలేరు మీకెవ్వరు’.. ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న  ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానంలో ‘కళ్లుకుల్ ఇరమ్’, ‘కిలాడి కృష్ణుడు’(1979) నుంచి.. నేటి  ‘సరిలేరు నీకెవ్వరు’(2020) వరకు గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు.  మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు.. మీ విజయశాంతి’’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని