Vishwak sen: విశ్వక్‌ సేన్‌ కొత్త సినిమా.. బాలీవుడ్‌ బ్యూటీకి ఛాన్స్‌..?

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). దీనికి సంబంధించి ఓ క్రేజీ ఆఫర్‌ను బాలీవుడ్‌ బ్యూటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 01 Feb 2024 22:39 IST

హైదరాబాద్‌: విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి (Neha Shetty) కథానాయిక. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులోని స్పెషల్‌ సాంగ్‌ కోసం నటి ఈషా రెబ్బా (Eesha Rebba)ను ఎంపిక చేసుకున్నారని.. కొంతమేర షూటింగ్‌ కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో బాలీవుడ్‌ నటి, ‘బిగ్‌బాస్‌ 17’ ఫేమ్‌ అయేషా ఖాన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఈషా ఈ చిత్రీకరణలో పాల్గొనలేకపోయారని, అందుకే అయేషాను తీసుకున్నారని టాక్‌. మరోవైపు, ఓ షూట్‌లో పాల్గొన్న ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘త్వరలో ఇది విడుదల కానుంది’’ అని చెప్పడంతో.. ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇంతకుముందు ఈమె ‘ముఖచిత్రం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

1990ల నేపథ్యంలో సాగే కథ ఇది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. అప్పట్లో గోదావరి గ్యాంగ్‌ వార్స్‌, రాజకీయాలు ఎలా ఉండేవో చూపించనున్నారు. ‘‘అన్నాయ్‌.. మేము గోదారోళ్లం. మాటొక్కటే సాగదీస్తాం. తేడా వస్తే నరాలు లాగేస్తాం’’ అనే డైలాగ్‌తో కూడిన గ్లింప్స్‌ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ‘సుట్టంలా సూసి..’ అంటూ సాగే పాట విశేషంగా ఆకట్టుకుంది. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని