Mohan Babu: 90 రోజుల తర్వాత...

మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ‘కన్నప్ప’ తొలి షెడ్యూల్‌ పూర్తయింది. న్యూజిలాండ్‌లో 90 రోజులపాటు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణని పూర్తి చేసి, భారత్‌కి తిరిగి పయనమైనట్టు ప్రముఖ నటుడు మోహన్‌బాబు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Updated : 24 Dec 2023 10:39 IST

మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ‘కన్నప్ప’ తొలి షెడ్యూల్‌ పూర్తయింది. న్యూజిలాండ్‌లో 90 రోజులపాటు కీలకమైన సన్నివేశాల చిత్రీకరణని పూర్తి చేసి, భారత్‌కి తిరిగి పయనమైనట్టు ప్రముఖ నటుడు మోహన్‌బాబు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఆయనతోపాటు.. మోహన్‌లాల్‌, ప్రభాస్‌, శివరాజ్‌కుమార్‌ తదితర ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. న్యూజిలాండ్‌లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణని 600 మంది నటులు, సాంకేతిక నిపుణులతో పూర్తి చేశారు. 80 శాతం చిత్రీకరణని అక్కడే తెరకెక్కించనున్నారు. అద్భుతమైన లొకేషన్లలో, చిత్రీకరణ దిగ్విజయంగా సాగినట్టు మోహన్‌బాబు తెలిపారు. ఛాయాగ్రహణం: షెల్డన్‌ చౌ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని