Mohanbabu: నా ఇంటికి ఎందరో వస్తారు.. ఆ విషయాన్ని తప్పుపడితే ఎలా: మోహన్బాబు
మోహన్బాబు ఇంటర్వ్యూ. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలివీ..
హైదరాబాద్: సుమారు మూడేళ్ల తర్వాత సినీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు మోహన్బాబు(Mohan babu). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా విశేషాలపై మోహన్బాబు మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
సినిమానే ఊపిరి..
‘‘మొదటి నుంచీ సినిమానే నా ఊపిరిగా భావించా. మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనుకున్నా. ఇటీవల ఓసారి డైమండ్ రత్నబాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పారు. అది వినగానే నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. మూడేళ్ల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా గురువుగారు దాసరి నారాయణరావు నటుడిగానూ ఎన్నో ప్రయోగాలు చేశారు. నేనూ ఆయనలా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశా. ఇది చెడ్డ సినిమా కాదు. సినిమా అందరికీ నచ్చుతుందా? లేదా? సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చెప్పలేకపోవచ్చు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది మంచి చిత్రమని తప్పకుండా ఫీల్ అవుతారు’’
కథ డిమాండ్ మేరకు..
‘‘కథ డిమాండ్ చేయడం వల్ల ఈ సినిమాలో అమ్మాయిల మధ్య ముద్దు సీన్లు పెట్టాల్సి వచ్చింది. విష్ణు దానికి ఒప్పుకోలేకపోయాడు. ‘డాడీ మనకి సొసైటీలో మంచి పేరు ఉంది. విద్యాసంస్థలు నడుపుతున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ సీన్లు పెడితే బాగోదేమో’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. నా ప్రవర్తన సరిగా లేని రోజున నేను మనిషిగా జీవించడానికి అనర్హుడ్ని. నేనేంటో అందరికీ తెలుసు. కాబట్టి, కథ డిమాండ్ చేసింది కాబట్టే వాటిని ఓకే చేశాం. అందరికీ అది తప్పకుండా అర్థమవుతుందని చెప్పా’’.
‘‘ఓ మంచి వ్యక్తి.. ఎమ్మెల్యే వల్ల ఎలా నాశనం అయ్యాడు. చేయని తప్పునకు జైలుకి ఎలా వెళ్లాడు. అతడినే నమ్ముకున్న భార్యాపిల్లలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అనే కథాంశంపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ అంశంపై విశ్లేషణ చేస్తే.. భారతదేశంలో అన్యాయంగా జైల్లో జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారని తెలిసింది. రఘువీర గద్యాన్ని కావాలని ఈ సినిమాలో ఒక పాటగా వాడాం. దాని చిత్రీకరణ, గ్రాఫిక్స్ కోసం సుమారు రూ. కోటిన్నర ఖర్చు చేశాం. సినిమాలో ఆ గద్యాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఐదారుగురు సింగర్స్తో దాన్ని పాడించాం. కానీ, ఇళయరాజాకి నాకూ వాళ్ల వాయిస్ నచ్చలేదు. చివరికి మలయాళీ సింగర్ రాహుల్ నంబియార్ దీన్ని ఆలపించారు’’.
మంచి సినిమా అనుకునేలా..
‘‘సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు. వాటిని రహస్యంగానే ఉంచాలనుకుంటున్నా. ఇందులో ఎవరెవరు నటించారు? ఏ పాత్రలు పోషించారు అనేది నేను ఇప్పుడే చెప్పను. అందరూ మంచి పాత్రలు పోషించారు. గత సినిమాల అనుభవం కారణంగా సినిమా తప్పకుండా సూపర్హిట్ అవుతుందని గంటాపథంగా చెప్పను. కానీ, ‘మోహన్బాబు మంచి సినిమా చేశారు’ అని అందరూ అనుకుంటారు. సక్సెస్ అయితే మంచి సక్సెస్ అవుతుంది. లేదంటే లేదు. దానికీ సిద్ధమయ్యా. సెన్సార్ చేసినప్పుడు కేవలం కొన్ని పదాలను మాత్రమే మ్యూట్ చేశారు’’.
‘‘ఈ సినిమా పూర్తి నిడివి గంటన్నర మాత్రమే. మొదట ఓటీటీ కోసం అనుకున్నాం. అందుకు అనుగుణంగానే ముద్దు సన్నివేశాలు ఎక్కువ పెట్టాం. కాకపోతే తర్వాత దీన్ని థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సెన్సార్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సన్నివేశాలు తొలగించాం. ఓటీటీలో విడుదల చేసే సమయంలో తొలగించిన సన్నివేశాలన్నింటినీ మళ్లీ యాడ్ చేసి ప్రసారం చేస్తాం. ప్రైవేటు జైలు అనే కాన్సెప్ట్ని ఈ సినిమాలో చూపించాం. ఇది నిజజీవిత కథ అని చెప్పను. కానీ, రియల్లైఫ్లో మనం ఇలాంటి కథలను ఎన్నో చూస్తుంటాం’’.
అదే నా భయం..
‘‘దర్శకత్వం చేయాలని రెండు స్క్రిప్ట్లు సిద్ధం చేసి పెట్టా. కానీ, రోజూ ఎవరో ఒకర్ని కొడతానని భయం. ఎందుకంటే నటీనటులు ఆలస్యంగా వచ్చినా, వెంటనే కారవ్యాన్లోకి వెళ్లినా నేను కోప్పడతాను. మా రోజుల్లో ఔట్డోర్ షూట్కి వెళ్తే కారవ్యాన్ ఉండేది కాదు. అందరూ ఇబ్బందిపడేవాళ్లం. నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రాయలసీమ వాడు సినిమాకి పనికిరాడు అన్నారు. రాయలసీమ వారికి భాష తెలియదు అన్నారు. ఆ సమయంలో అన్నయ్య రామారావు సినిమాలు చూశా. ఆయన డైలాగ్లు విని భాష నేర్చుకున్నా. ఆ తర్వాత గురువుగారు దాసరినారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నా’’.
‘‘నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. నా ప్రయాణం సాఫీగా సాగలేదు. రాయలసీమలోని ఓ పల్లెటూరులో పుట్టా. ఆకలి నుంచే నాకు కోపం వచ్చింది. నేను కోపానికే బానిసయ్యా. నాకోపం నాకే నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు నా జీవితకథతో పుస్తకం రాస్తున్నా. త్వరలో అందుబాటులోకి తీసుకువస్తా. నా బయోపిక్ గురించి ఎలాంటి ఆలోచనా లేదు. అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలకీ ఎంతో తేడా ఉంది. రాజకీయం మారిపోయింది. ఒకప్పుడు రాజకీయాల్లో ఉంటే గొప్పవాడు అనేవారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే చులకనగా చూస్తున్నారు. ప్రత్యక్షరాజకీయాల్లోకి రాను’’.
దాన్ని తప్పుపడితే ఎలా?
‘‘నా ఇంటికి మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు.. ఇలా ఎంతోమంది అతిథులుగా వస్తుంటారు. వారు పిలిస్తే నేనూ వెళ్తుంటా. అలాంటిది మంత్రి పేర్నినాని మా ఇంటికి అతిథిగా వస్తే రకరకాల వార్తలొచ్చాయి. ఓ వివాహానికి హైదరాబాద్ విచ్చేసిన ఆయన్ను బ్రేక్ఫాస్ట్కి రమ్మని ఆహ్వానించా. దాన్ని తప్పుపడితే ఎలా? ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిగారు ఏం అన్నారు? మా సినిమా వాళ్లు ఏం మాట్లాడారు? అని నేను ఆయన్ను అడగలేదు. ఏదో సరదాగా మాట్లాడుకున్నాం. ఆయనకు శాలువా కప్పాం. ఆ ఫొటోని పంచుకుంటూ విష్ణు ట్వీట్ చేశాడు. టికెట్ ధరల విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడదలచుకోలేదు. దాని గురించి ఎప్పుడో చెప్పా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్