Swathi: ఆ వార్తల వల్ల నేనెంతో బాధపడ్డా: స్వాతి
‘మంత్ ఆఫ్ మధు’ ప్రెస్మీట్లో భాగంగా తన గురించి వచ్చిన పలు కథనాలను ఉద్దేశించి స్వాతి మాట్లాడారు.
ఇంటర్నెట్డెస్క్: స్వాతి (Swathi), నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మంత్ ఆఫ్ మధు’ (Month Of Madhu). శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ప్రెస్మీట్ నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన ఈ విలేకర్ల సమావేశంలో సినిమా రివ్యూలు రాసే పలువురు వ్యక్తులపై దర్శకుడు శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు.
వెబ్సిరీస్ మాదిరిగా మీ చిత్రాన్ని వివిధ భాగాలుగా చూపించారు కదా. సినిమాకు అదేమైనా మైనస్ అయ్యిందని అనుకుంటున్నారా?
శ్రీకాంత్: అలా ఏమీ లేదు. ఒకవేళ మళ్లీ నాకు అవకాశం ఇచ్చి ఈ చిత్రాన్ని ఎడిట్ చేయమని కోరితే ఒక్క ఫ్రేమ్ కూడా మార్చను. ఎందుకంటే, ఒక మంచి ఆలోచనతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రతీది ఒక కారణంతో ఎడిట్ చేశాం. ప్రతిచోటా లాజిక్ ఉంది. అర్థం చేసుకుని సినిమా చూస్తే తప్పకుండా మనసుని హత్తుకుంటుంది.
థియేటర్ల సంఖ్య పెంచే అవకాశం వస్తుందా?
శ్రీకాంత్: కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించడం కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించా. విడుదలైన రోజుతో పోలిస్తే నేడు థియేటర్ల సంఖ్యలో కాస్త మార్పు ఉంది. ప్రేక్షకుల మాటలతోనే ఈ సినిమా అందరికీ రీచ్ కావాలని నేను కోరుకుంటున్నా.
ప్రేక్షకుల నుంచి మీ పాత్రకు ఎలాంటి రియాక్షన్ వస్తుంది?
నవీన్ చంద్ర: సినిమాలో నేను పోషించిన మధుసూదనరావు పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి నేను ఎంతో ఆనందిస్తున్నా. నిన్న థియేటర్స్ విజిట్కు వెళ్లా. సినిమా పూర్తైన వెంటనే కొంతమంది నా వద్దకు వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారు. వాళ్ల రియాక్షన్ చూసి నాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరూ చూడాలి.
Varuntej-Lavanya: చిరంజీవి నివాసంలో మొదలైన ప్రీవెడ్డింగ్ వేడుకలు.. ఫొటోలు వైరల్
క్లైమాక్స్ సడెన్గా ముగిసినట్టు ఉంది? పార్ట్ 2 ఏమైనా ఉందా?
శ్రీకాంత్: పార్ట్ 2 చేయాలనే ఆలోచన నాకేమీ లేదు. మరో విషయం ఏమిటంటే.. మా సినిమా చూసి కొంతమంది మంచి రివ్యూలు రాశారు. మా వర్క్ ఎక్కడ బాగుంది? ఎక్కడ బాలేదు అనేది చక్కగా వివరించారు. వాటి నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ, కొంతమంది విమర్శలు చేస్తూ రాశారు. నేను చెప్పేది ఒక్కటే.. లైఫ్కి ఎవరైతే ఓపెన్గా ఉండరో మా సినిమా వాళ్ల కోసం కాదు. అలాంటివాళ్లు దయచేసి మా సినిమాకు రావొద్దు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొవాలి అనే వాళ్ల కోసమే ఈ సినిమా.
‘సోల్ ఆఫ్ సత్య’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి ప్రాజెక్ట్లు ఓకే చేయడానికి కారణం ఏమిటి?
స్వాతి: ‘సోల్ ఆఫ్ సత్య’ మీరింకా పూర్తిగా చూడలేదండి. కేవలం పాట మాత్రమే చూశారు. దాని క్లైమాక్స్.. మా సినిమా క్లైమాక్స్లాగే అద్భుతంగా ఉంటుంది. ఈ రెండింటిలో నా లుక్స్ ఒకేలా ఉండటం చూసి రెండూ ఒకేలాంటి సినిమాలు అనుకుంటున్నారేమో. లేఖ, సత్య పాత్రల మధ్య ఎంతో తేడా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్లు చేసినందుకు నేను గర్వపడుతున్నా. వ్యక్తిగతంగా నేను ఎంతో వృద్ధి చెందా. అయితే, కొంతమంది జర్నలిస్ట్లు నా గురించి రాసిన వార్తలు చూసి నేనెంతో బాధపడ్డా. ముఖ్యంగా కొన్ని కథనాలు చదివి కుమిలిపోయా. ఆ కథనాలు చదివిన వాళ్లు అదే నిజం అనుకున్నారు. నన్ను నమ్మలేదు. ఒక నటిగా నేను విమర్శలు తీసుకుంటా. అది నా వృత్తి. అంతేకానీ, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు రాస్తే తట్టుకోవడం కష్టం కదా!
అప్పుడు ‘అమ్ము’ ఇప్పుడు ‘మంత్ ఆఫ్ మధు’.. ఇలాంటి సినిమాలు ఎంచుకోవడానికి కారణం ఏమిటి?
నవీన్ చంద్ర: ఇలాంటి పాత్రల్లో లైఫ్ ఉంటుంది. రియాలిటీకి దగ్గర ఉండే పాత్రలివి. శ్రీకాంత్ ఈ సినిమా ఆఫర్ తీసుకువచ్చినప్పుడు తప్పకుండా యాక్ట్ చేయాలనిపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు.