Project K: జూన్‌లో రంగంలోకి..

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీపిక పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఓ మేజర్‌ షెడ్యూల్‌

Updated : 18 May 2022 06:52 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీపిక పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ‘‘ప్రభాస్‌ పరిచయ సన్నివేశాలతో కూడిన ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయింది. జూన్‌ నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. రిలీజ్‌ ఆర్డర్‌లో మనం లాస్ట్‌ కదా. తరచుగా అప్‌డేట్స్‌ ఇవ్వడానికి ఇంకా సమయముంది. భరోసా ఉంచండి.. అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. రూ:400కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని