Adavallu Meeku Joharlu: ‘ఆడవాళ్ళు...’నా నమ్మకాన్ని నెలబెడుతుంది!
‘‘కొవిడ్ ప్రభావం తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ బయటికొస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులందరినీ మా సినిమా థియేటర్కి తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధాకర్ చెరుకూరి. శ్రీలక్ష్మీ
‘‘కొవిడ్ ప్రభావం తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ బయటికొస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులందరినీ మా సినిమా థియేటర్కి తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధాకర్ చెరుకూరి. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై వరుసగా సినిమాలు తీస్తున్న నిర్మాత ఆయన. శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్ని నిర్మించారు. తిరుమల కిషోర్ దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘మేం తొలి ప్రయత్నంగా చేసిన ‘పడి పడి లేచే మనసు’ తర్వాత ఓ మంచి కుటుంబ కథని నిర్మించాలనుకున్నాం. దర్శకుడు కిషోర్ దగ్గర అలాంటి కథ ఉందని తెలిసి విన్నాం. మేం ఏదైతే ఊహించామో అలాంటి కథే అది. ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, ఆప్యాయతల నేపథ్యంలో సాగే కథ. నాకు బాగా నచ్చింది. ఈ కథకి తగ్గ నటులే కావాలనిపించింది. రష్మిక, ఖుష్బూ, రాధిక తదితరుల్ని ఎంపిక చేసుకున్నాక, తీరా వాళ్ల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆరు నెలలు ఆలస్యమైనా ఈ సినిమాని చేశాం. మహిళలు ఎక్కువగా ఉన్న ఓ కుటుంబంలో వారసుడిగా ఓ మగాడు ఉంటే అతనిపై ఎలా ప్రేమని కురిపిస్తారు? ఆ ప్రేమతో తెలియకుండానే ఎలా ఇబ్బంది పెడతారనే అంశాల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. మా సినిమా నేపథ్యం, ఎంచుకున్న అంశం నచ్చే దర్శకుడు సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు’’.
* ‘‘కుటుంబం నేపథ్యంలో సాగే డ్రామాతోపాటు, కావల్సినంత హాస్యం ఉంటుంది. దర్శకుడు కిషోర్ ప్రత్యేకత అదే. ప్రతి కుటుంబంలోనూ పెద్దమ్మలు, చిన్నమ్మలు, బామ్మలు... ఇలా చాలా సందడే ఉంటుంది. నేనూ ఆ బంధాల మధ్య నుంచి వచ్చినవాణ్నే. అందుకే బాగా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట తమని తాము చూసుకుంటారు. నా నమ్మకాల్ని నిలబెట్టే చిత్రమిది. కొవిడ్ సమయంలోనే నటీనటుల సహకారంతో చిత్రాన్ని అనుకున్న సమయంలోనే పూర్తి చేశాం. దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన సంగీతం ఇప్పటికే విజయవంతమైంది. శర్వానంద్, రష్మికతోపాటు... సాంకేతిక బృందమంతా చక్కటి సహకారం అందించింది’’.
* ‘‘ఇష్టంతోనే సినిమా రంగంలోకి వచ్చాను. నాకు అమెరికాలో ఐటీ కంపెనీ ఉండేది. కుమార్తె పుట్టాక ఇండియాకి తిరిగొచ్చా. తొలి సినిమా ‘పడి పడి లేచే మనసు’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ అనుభవాలతో ఈసారి మరింత ఉత్తమమైన సినిమా చేయాలనుకున్నాం. శర్వా నన్నొక సోదరుడిలానే చూస్తుంటాడు. నిర్మాణం పరంగా శ్రీకాంత్ సహకారం చాలా ఉంది. నిర్మాతగా నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి. ప్రస్తుతానికి మంచి సినిమాలు చేయడమే నా ముందున్న లక్ష్యం. రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’తోపాటు, రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, నాని ‘దసరా’ సినిమాలు మా సంస్థలో తెరకెక్కుతున్నాయి. ఈ మూడూ భిన్నమైన కథలే’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది... బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్స్టర్గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.