Raja ravindra: సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా!
నాకు సినిమా అంటే పిచ్చి, సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా’ అన్నారు నటుడు రాజారవీంద్ర. శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో రాజారవీంద్ర కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజారవీంద్ర విలేకరులతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
ఇంటర్నెట్ డెస్క్: ‘నాకు సినిమా అంటే పిచ్చి, సినిమాల్లో వేషాలు దొరక్కపోతే.. ఆర్టిస్టులకు టీ, కాఫీలు ఇచ్చి బతుకుతా’ అన్నారు నటుడు రాజారవీంద్ర. శ్రీముఖి ప్రధానపాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో రాజారవీంద్ర కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజారవీంద్ర విలేకరులతో ముచ్చటించారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..
‘‘నేను గతంలో జయసుధగారితో ‘ఆంటీ’ అనే సినిమా చేశా. జనరేషన్ గ్యాప్ రావడంతో ఇప్పుడు అంకుల్స్ అయ్యాం(నవ్వుతూ). మంచి ఎంటర్టైన్మెంట్ జోనర్ ఇది. కరోనా వల్ల ఎంటర్టైన్మెంట్ జోనర్లో కొంతకాలంగా మంచి సినిమాలు రావడం లేదు. ఇది చాలా మంచి సినిమా అవుతుంది. థియేటర్కు వచ్చిన వారంతా కరోనాను మరిచిపోయి హాయిగా నవ్వుకుంటారు’’
‘‘ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే. 50ఏళ్ల వయసున్న వ్యక్తికి పెళ్లయి.. పిల్లలు పుట్టి.. వాళ్లకు కూడా పిల్లలు పుట్టి.. సమయం అంతా మనవలు, మనవరాళ్లతో ఆడుకునేందుకే సరిపోతుంది. ఆ తర్వాత భార్య, భర్త మధ్య కాస్త గ్యాప్ వస్తుంది. ఆ సమయంలో చిన్న ఆనందం కోసం ఫేస్బుక్, వాట్సాప్ ఛాటింగ్తో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్ని తప్పులు చేశాడన్నదే నా పాత్ర’’
‘‘రియల్ ఎస్టేట్ వ్యాపారిగా నేను కనిపించనున్నాను. మనోగారిది బంగారం దుకాణం, భరణిగారు వడ్డీ వ్యాపారం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. భవిష్యత్తులో మనం ఎలా ఉండాలనే కోణంలో యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది’’
‘‘ఈ సినిమాలో కొత్తకోణం ఏంటంటే.. ముగ్గురు మధ్య వయసున్న వ్యక్తులు కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేయడం సరదాగా ఉంటుంది. ముగ్గురూ స్నేహితులు కావడం.. ఒకరికి తెలియకుండా.. ఒకరు అమ్మాయిని పడేయాలని చూడటం బాగా కట్టుకుంటాయి’’
‘‘సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం ఉండవు. కుటుంబంతో సహా చూడగలిగే సినిమా ఇది. యాంకర్గా శ్రీముఖి అందరికీ తెలిసిన వ్యక్తే. చాలా యాక్టీవ్గా ఉంటుంది. మనోగారితో పాటు కొన్ని షోలు కూడా చేసింది. మాకు కూడా కొత్తేం కాదు. అందరం కలిసి సరదాగా ఆడుతూపాడుతూ ఈ సినిమా చేశాం’’
‘‘నేను చేసిన సినిమాల్లో విలన్ పాత్రలే ఎక్కువ. అయితే.. నేను బయట కూడా చాలా సరదాగా ఉంటాను. నా అప్పీరెన్స్ ఎలాగూ విలన్లాగే ఉంటుంది కాబట్టి.. సీరియస్ పాత్రలు చేయాలంటే కేవలం డైలాగ్స్ చెబితే సరిపోతుంది. కానీ కామెడీ విషయంలో అలా ఉండదు. మంచి టైమింగ్ ఉండాలి. నిజానికి కామెడీ పాత్రలు చేయడం చాలా కష్టం. గతంలో ఆంటీ సినిమాలో కామెడీ పాత్ర చేశాను. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో చేశాను’’
‘‘కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎవరికి వైరస్ వచ్చినా అందరికీ ఇబ్బందే. సినిమా షూటింగ్ ఆపేయాల్సిన పరిస్థితి. అందుకే వేగంగా పూర్తి చేశాం. మొదటి ఈ సినిమాను ఓటీటీకి ఇద్దాం అనుకున్నాం. సినిమా థియేటర్కు వెళితేనే బాగుంటుంది అనిపించింది. అందుకే థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమాలో పోసానిగారి పాత్ర కూడా చాలా నవ్విస్తుంది’’
‘‘నాకు సినిమా అంటే పిచ్చి. ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే.. ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ ఇక్కడే బతుకుతానని ఎన్నోసార్లు చెప్పాను. నా దగ్గరికి వచ్చిన ఏ సినిమా అవకాశాన్ని నేను వదులుకోను. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకోను’’
‘‘నా విషయానికొస్తే నా కెరీర్లోనే ఎక్కువ సినిమాలు చేసింది కరోనా సమయంలోనే. నాకు తెలిసి హైదరాబాద్లో 100నుంచి 120 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఓటీటీ రావడం వల్ల అవకాశాలు ఇంకా పెరిగాయి. రెమ్యునరేషన్ కూడా ఎవరికి తగ్గలేదు. పెరిగిందనే చెప్పాలి. నేను మొదటి నుంచి జీవితాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆ ప్రభావం నా కెరీర్ మీద పడిందనుకుంటా(నవ్వుతూ). ఇప్పుడు సీరియస్గా తీసుకున్నా సమయం లేదు.
‘‘ఈవీవీ సత్యనారాయణగారు గొప్ప డైరెక్టర్. ఎందుకంటే.. ఆయన పెద్ద స్టార్లతో సినిమాలు చేసి.. ఆ తర్వాత చిన్నచిన్న సినిమాలు కూడా చేసేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. చిన్న సినిమాలకు పెద్ద డైరెక్టర్లు రావడం లేదు. చిన్ని సినిమాలను తీసిన పెద్ద డైరెక్టర్ అంటే ఈవీవీ ఒక్కరే’’
‘‘ఓటీటీలో సినిమా హిట్టా, ఫట్టా అనే విషయాన్ని అంచనా వేయలేం. సినిమా ఫలితాన్ని నిర్ణయించేది థియేటర్ మాత్రమే. థియేటర్లను బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు కోసం ఓటీటీకి సినిమాలు ఇస్తూ వెళ్తే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సినిమా మీద ఆధారపడి ఎంతోమంది ఉన్నారు’’ అని రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్