rajinikanth: పాతికేళ్ల యువకుడిగా..

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో తెరకెక్కనున్న ‘తలైవర్‌ 171’ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఇందులో డీ-ఏజ్‌నింగ్‌ అనే సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారనే సరికొత్త కబురు వినిపించింది చిత్రబృందం.

Updated : 05 Feb 2024 09:14 IST

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో తెరకెక్కనున్న ‘తలైవర్‌ 171’ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఇందులో డీ-ఏజ్‌నింగ్‌ అనే సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారనే సరికొత్త కబురు వినిపించింది చిత్రబృందం. దీంతో  రజనీకాంత్‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో పాతికేళ్ల నవ యువకుడిగా కనిపించే అవకాశం ఉందంటున్నారు. రజనీ గతంలోనూ ‘కబాలి’, ‘కాలా’, ‘రోబో’ తదితర చిత్రాల్లో వయసు తగ్గినట్లుగా కనిపించారు. వాటికి మించి ఇందులో టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ మాయ చూపించడంతో.. రజనీ కొత్త అవతారంలో కనువిందు చేయనున్నారంటున్నారు. టెక్నాలజీని అత్యుత్తమంగా వాడటంలో ముందుండే లోకేశ్‌ కనగరాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో దీని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికితోడు ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో మొదలవుతుందనే మరో కబురూ వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు