Acharya: నాన్నా నేనూ కలిసి నటించడానికి ముఖ్య కారణం ఆమే: రామ్చరణ్
అగ్ర కథానాయకులు, తండ్రీకొడుకులు రామ్చరణ్, చిరంజీవి కలిసి నటిస్తే బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. వారిలో చిరంజీవి భార్య సురేఖ ఒకరు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ బిజీగా ఉన్నా ‘ఆచార్య’లో నటించేలా చేశారు. ఆమె ఏం చేశారు?
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర కథానాయకులు, తండ్రీకొడుకులు రామ్చరణ్, చిరంజీవి అతిథి పాత్రల్లో కాకుండా పూర్తిస్థాయిలో కలిసి నటిస్తే బాగుంటుందని చాలామంది కాంక్షించారు. వారిలో చిరంజీవి భార్య సురేఖ ఒకరు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ బిజీగా ఉన్నా ‘ఆచార్య’లో నటించేలా చేశారు. ఆమె రచించిన ప్రణాళిక ఏంటి? పాత్ర కోసం రామ్చరణ్ ఎలా సన్నద్ధమయ్యారు? తదితర ఆసక్తికర విశేషాలతో సాగే ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో దర్శకుడు కొరటాల శివ, రామ్చరణ్ పంచుకున్న సంగతులివీ..
* ‘ఆచార్య’లో రామ్చరణ్ను చూపించడానికి కారణమేంటి?
కొరటాల శివ: చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల. అందుకే ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ‘ఆచార్య’ కథ రాశా. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం స్టార్డమ్ ఉన్న నటుడ్ని తీసుకోవాలనుకున్నా. గురుకులంలో పెరిగిన అబ్బాయి క్యారెక్టర్ అది. ఇమేజ్ ఉన్న హీరో పోషిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించా. చరణ్ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. గురుకులం విద్యార్థిలా అనిపిస్తారు. అందుకే ఈ సినిమాలోని పాత్రకు ఆయన్ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఆ సమయంలో.. ఆయన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బిజీగా ఉంటారేమో అనే సందేహంలోనే నా మనసులో మాట చెప్పా. సినిమాలో నటించేందుకు తను వెంటనే ఓకే చెప్పారు. ‘ఎంత కష్టమైనా తప్పకుండా చేద్దాం’ అని అన్నారు.
* ఈ చిత్రానికి నిర్మాతగా మీరెందుకు వ్యవహరించాలనుకున్నారు?
రామ్చరణ్: కొరటాల శివ.. నాన్నకు కథ చెప్పినప్పుడే ఈ సినిమాను నేను నిర్మించాలనుకున్నా. కానీ, ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉండటంతో నిర్మాత నిరంజన్తో చేతులు కలిపా. ఆయన గతంలో నాతో ఓ సినిమా నిర్మించాలనుకున్నారు. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడిలా సాధ్యమైంది.
* చిత్రీకరణ అనుభవాల గురించి చెప్తారా?
రామ్చరణ్: కొత్తింటి నిర్మాణం దృష్ట్యా గత నాలుగేళ్లుగా నాన్నా నేనూ వేర్వేరుగా ఉంటున్నాం. ఆదివారం, ప్రత్యేకమైన రోజుల్లో కలుసుకుంటుంటాం. ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం సుమారు 18 రోజులు ఒకే ఇంట్లో ఉన్నాం. ఒకే సమయానికి లేవడం, కసరత్తులు, భోజనం.. ఇలా ప్రతిదీ కలిసే చేసేవాళ్లం. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలవి. ‘ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ‘ఆచార్య’ రూపంలో మనకిప్పుడు వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేద్దాం’ అని నాన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు.
* చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయాలన్నప్పుడు ఏం ఫీలయ్యారు?
రామ్చరణ్: ఆయనతో కలిసి డ్యాన్స్ అనగానే నా గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. చెమట పట్టేది. ఆ భయం బయటకు కనిపించకుండా మేనేజ్ చేశా. విశేషం ఏంటంటే.. మేం డ్యాన్స్ చేసేటప్పుడు మా అమ్మ, నానమ్మ సెట్కు వచ్చారు. ‘నా కొడుకు బాగా చేస్తున్నాడంటే లేదు నా కొడుకు’ అంటూ ఇద్దరు సరదాగా గొడవ పడేవారు.
* ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ ఒకేసారి రెండింటిలో నటించేందుకు ఎలా సన్నద్ధమయ్యారు?
రామ్చరణ్: నాన్నా నేనూ పూర్తిస్థాయిలో తెరను పంచుకోవాలనేది మా అమ్మ కోరిక. ఆవిడ బలమైన కాంక్ష వల్లే ఇది సాధ్యమైంది. డేట్స్ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళితో మాట్లాడమని నాన్నను కోరింది. అలా.. కాల్షీటు వెసులుబాటు కల్పించిన రాజమౌళికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండు సినిమాల్లోని పాత్రలకు పోలిక ఉండదు. అలా అని మేం దీనికోసం పెద్ద కష్టపడిందీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విరామ సమయంలో నా లుక్కు శివ కొంచెం మెరుగులు దిద్దారు. అది ‘ఆచార్య’లోని పాత్రకు బాగా సెట్ అయింది.
* పూజాహెగ్డేతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
రామ్చరణ్: తను గొప్ప నటి అనే విషయం తెలిసిందే. ఆమె ఇతర ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నా ఈ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.