Sai Dharam Tej: కొత్త చిత్రం కోసం రంగంలోకి

కథానాయకుడు సాయి తేజ్‌ సినీప్రియులకు కొత్త కబురు వినిపించారు. కొత్త సినిమా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గతేడాది బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆర్నెళ్లుగా పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన.

Updated : 27 Mar 2022 07:26 IST

థానాయకుడు సాయి తేజ్‌ సినీప్రియులకు కొత్త కబురు వినిపించారు. కొత్త సినిమా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన గతేడాది బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ఆర్నెళ్లుగా పూర్తి విశ్రాంతిలో ఉన్న ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. దీంతో మళ్లీ సెట్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. రోడ్డు ప్రమాద సమయంలో తనని సకాలంలో ఆస్పత్రికి తరలించి, తన ప్రాణాలు కాపాడిన యువకుడు సయ్యద్‌ అబ్దుల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాను కోలుకోవడానికి సహాయం చేసిన వైద్య సిబ్బందికి, తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అభిమానులకు, తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 28 నుంచి సుకుమార్‌, బాబీ నిర్మాణంలో రూపొందనున్న కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విభిన్నమైన మిస్టిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు కార్తీక్‌ దండు దర్శకుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని