Samantha: సమంత హెల్త్‌పై వార్తలు.. మేనేజర్‌ ఏం చెప్పారంటే..?

అగ్రకథానాయిక సమంత (Samantha) అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తోన్న వార్తలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పుకొచ్చారు......

Updated : 21 Sep 2022 10:45 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయిక సమంత (Samantha) అనారోగ్యానికి గురయ్యారంటూ వస్తోన్న వార్తలపై ఆమె మేనేజర్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పుకొచ్చారు. సామ్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బదులిచ్చారు. అయితే, సామ్‌ యూఎస్‌కు ఎందుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం ఆయన స్పందించలేదు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే సమంత (Samantha) గత నెల రోజుల నుంచి అన్నింటికీ దూరంగా ఉన్నారు. సినిమా ఫంక్షన్స్‌లో కానీ, యాడ్‌ షూట్స్‌లో కానీ ఆమె కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు  సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నారని ఆయా వార్తల్లోని సమాచారం. ఇదిలా ఉండగా, స్కిన్‌ ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్తున్నట్లు రెండు రోజుల నుంచి నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఓ ఆంగ్ల పత్రిక సామ్‌ మేనేజర్‌ను సంప్రదించగా ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక, సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని