Samantha: స్కూల్‌ పిల్లలతో సమంత.. ఫొటోలు వైరల్‌

నటి సమంత (Samantha) తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.

Updated : 08 Dec 2023 11:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు నటి సమంత (Samantha). అందుకే సోషల్‌ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్‌లు ఆకట్టుకుంటుంటాయి. చాలా రోజుల తర్వాత సమంత తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. ఒక స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి సమంత వెళ్లారు. అక్కడ చిన్న పిల్లలతో కలిసి ఆమె సరదాగా గడిపారు. 

త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్‌

పిల్లలతో ఉన్న ఫొటోలను పంచుకున్న ఆమె ‘ఒక పుస్తకం, పెన్ను, టీచర్‌, చిన్న పిల్లలతో మాత్రమే ప్రపంచాన్ని మార్చగలం’ అని క్యాప్షన్‌ రాశారు. సమంత ఇందులో న్యూలుక్‌లో కనిపిస్తున్నారు. దీంతో అభిమానులు ఈ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఇక ఈ ఫొటోలతో పాటు ఆమె వ్యాయామం చేస్తున్న పాత వీడియోను కూడా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ‘సంవత్సరం క్రితం ఇలా ప్రారంభించా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించారు. చివరిగా విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషి’లో కనిపించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. ఇక దీనితోపాటు ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన ‘సిటడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్ కూడా త్వరలోనే స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో సమంత-వరుణ్‌ ధావన్‌లు నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని