Baahubali: ఈ ఒక్క సీన్ మొదట అనుకున్నట్లు తీసి ఉంటే.. మరో రేంజ్లో ఉండేది
‘బాహుబలి’ (Baahubali) తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేసిన చిత్రం. రూ.100కోట్లు వసూలు చేయడం గొప్పగా చెప్పుకునే సందర్భంలో
ఇంటర్నెట్డెస్క: ‘బాహుబలి’ (Baahubali) తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చేసిన చిత్రం. రూ.100కోట్లు వసూలు చేయడం గొప్పగా చెప్పుకునే సందర్భంలో రూ.1000కోట్ల మార్కును దాటేసి, రికార్డులు తిరగరాసింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ల నటన.. రాజమౌళి టేకింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్ కెమెరావర్క్ ఇలా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జులై 10, 2015న విడుదలైన ‘బాహుబలి:ది బిగినింగ్’ ఆదివారంతో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి ఓ సందర్భంలో రాజమౌళి పంచుకున్న ఆసక్తికర విషయాలు..
ఇంటర్వెల్ సీన్ అలా తీద్దామనుకున్నారు
ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. కానీ, తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ వేద్దామనుకున్నారు జక్కన్న. ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు’ అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి ఫిగర్ రావడంపై ఇంటర్వెల్ ఇవ్వాలి. దాని కన్నా ముందు శివుడు రకరకాల దశలు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. కానీ, ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ‘ప్రభూ.. నన్ను ఏమీ చేయొద్దు’ అని వేడుకుంటాడు. అతడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి, బిజ్జలదేవుడికి విషయం చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మడు. ‘బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం’ అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి. ‘వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం’ అనగానే అగ్ని కీలలను దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాం. ఇక్కడ ఇంటర్వెల్ వేద్దామనుకున్నాం. కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడి డైలాగ్స్ అన్నీ తీసేశాం. శివుడి మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను ‘నిప్పులే శ్వాసగా’ అంటూ సాంగ్లా తీశాం.’’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో పంచుకున్నారు.
కోతిని పెట్టేందుకు అనుమతిలేక..
‘బాహుబలి-1’లో శివుడితో పాటు ఓ కోతిని కూడా పెట్టాలని రాజమౌళి అనుకున్నారట. జలపాతం దగ్గర కొమ్మను పట్టుకునేందుకు దూకినప్పుడు మొదటిసారి శివుడు కింద పడిపోతాడు. కానీ, కోతి మాత్రం దూకేసి పైకి వెళ్లిపోయి, కొన్ని రోజులకు నగల మూటతో కిందకు వస్తుందని, ఆ నగలను చూసి అవంతిక రూపాన్ని శివుడు చెక్కుతాడని సన్నివేశం రాసుకున్నారు. కానీ, కోతిని పెట్టి సినిమా తీయడం నిబంధనల విరుద్ధం. కోతిని సీజేలో షూట్ చేసినా, కొన్ని సన్నివేశాల్లో నేచురల్గా ఉండేందుకు నిజమైన కోతిని పెట్టాల్సిందే. అయితే, అమెరికాలో శిక్షణ తీసుకున్న ఓ కోతిని కూడా సినిమా కోసం బుక్ చేశారట రాజమౌళి. ఇక్కడి కోతి అయినా, అమెరికా కోతి అయినా, నిబంధనలు ఒకటేనని సెన్సార్ వాళ్లు చెప్పడంతో ఆ నిర్ణయం విరమించుకుని అవంతిక మాస్క్ ఐడియాను డెవలప్ చేశారు. అలా జలపాతం నుంచి పడిన మాస్క్ను ఊహించుకుని ఇసుకపై బొమ్మగీస్తాడు శివుడు. ఆ తర్వాత అదే ఊహతో జలపాతం పైకి వెళ్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
శ్రీదేవికి రజనీ కంటే ఎక్కువ పారితోషికం
దివంగత తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్స్టార్ అని సంబోధిస్తుంటారు. -
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలై నేటికి 50 ఏళ్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలివీ.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
క్రమశిక్షణలో ఎన్టీఆర్ కాఠిన్యం!
షూటింగ్ జరుగుతున్న రోజుల్లో, కె.ఆర్.విజయ సెట్టుకి ఆలస్యంగా రావడమే కాకుండా, సమాచారం లేకుండా రెండు రోజులు షూటింగ్కు రాలేదు. -
కెమెరాకు సైతం అందని ఎన్టీఆర్ పరుగు.. పులితో ఛేజింగ్ సీక్వెన్స్ ఇలా..
ఎన్టీఆర్ పరిచయ సన్నివేశంలో పులితో ఛేజింగ్ చేసే సీన్ ఎలా తీశారో ‘ఆర్ఆర్ఆర్’ కెమెరామెన్ సెంథిల్కుమార్ ఇటీవల పంచుకున్నారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం