తరచూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకుంటా: శ్రుతి

సినీ నటి శ్రుతిహాసన్‌ తను నటించే సినిమా షూటింగ్‌ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కి రాకపోకలు సాగిస్తోంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది.

Published : 03 Apr 2021 01:34 IST

చెన్నై: సినీ నటి శ్రుతిహాసన్‌ తను నటించే సినిమా షూటింగ్‌ల కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో వెల్లడించింది. ‘‘సినిమా షూటింగ్‌ల కోసం నిత్యం ప్రయాణాలు చేస్తుంటాను. ఈ సమయంలో ప్రయాణం కొంత గందరగోళంగానే ఉంది. అందుకే తరచుగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకుంటుంటాను. నా వల్ల ఇతరులకు ఏ ఇబ్బంది రాకూడదని. నేను ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి ప్రోట్‌కాల్‌ని భద్రతా చర్యలును పాటిస్తుంటాను. శానిటైజర్లు, మాస్క్ ధంరించడం విషయంలో అస్సలు రాజీపడను. ఇవన్నీ పాటించాకే మిగతా విషయాల గురించి ఆలోచిస్తా’’ అని తెలిపింది.  శ్రుతిహాసన్‌ ఈ ఏడాదిలో రవితేజ‌తో కలిసి ‘క్రాక్‌’లో సందడి చేసింది. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్‌’ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనుంది. ఇక ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ చిత్రంలోనూ ప్రభాస్‌ సరసన కథానాయికగా నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని