Mehreen: ‘గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌’ను స్వీకరించిన మెహ్రీన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో నటి మెహ్రీన్‌ భాగమయ్యారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ విసిరిన సవాలును ఆమె స్వీకరించారు.

Updated : 09 Dec 2021 19:12 IST

హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో నటి మెహ్రీన్‌ భాగమయ్యారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ విసిరిన సవాలును ఆమె స్వీకరించారు. ఈ మేరకు ఆమె మూడు మొక్కలు నాటారు. వాటితో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ్‌ పాల్గొన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని