Annaatthe: రజనీ మూవీలో బాల సుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట విన్నారా?
బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన ‘అన్నాత్తే అన్నాత్తే’ గీతం విడుదలైంది. రజనీకాంత్ హీరోగా రూపొందుతోన్న చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భౌతికంగా ఈ లోకాన్ని విడిచివెళ్లినా సంగీత అభిమానుల మదిలో నిలిచే ఉన్నారు. అంతలా తన గానంతో అలరించారాయన. ఆయన అభిమానులకి ‘అన్నాత్తే’ చిత్ర బృందం ఎప్పటికీ మర్చిపోలేని కానుక అందించింది. బాల సుబ్రహ్మణ్యం చివరిగా ఈ సినిమా కోసం ‘అన్నాత్తే అన్నాత్తే’ అంటూ సాగే హుషారైన గీతాన్ని ఆలపించారు. తాజాగా ఆ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్ గీతంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎప్పటిలానే ఎస్పీబీ గానం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. వివేక రచించిన ఈ పాటకి డి. ఇమ్మాన్ స్వరాలు సమకూర్చారు. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ‘‘నా నటన జీవితంలో 45ఏళ్ల పాటు ఎస్పీబీ నా గొంతుక అయ్యారు. ‘అన్నాత్తే’ కోసం ఆయన పాడిన ఈ పాట చివరిది అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎస్పీబీపై ఉన్న నాకున్న ప్రేమ ఆయన గాత్రం రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.