Raghavendra Rao: సుమ ప్రోగ్రామ్పై కోప్పడ్డ రాఘవేంద్రరావు!
తమ బృందాన్ని మోసం చేశారంటూ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆరోపించారు. ‘డబ్బులొస్తాయని ఇక్కడికి వచ్చాం.
ఇంటర్నెట్ డెస్క్: తమ బృందాన్ని మోసం చేశారంటూ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆరోపించారు. ‘డబ్బులొస్తాయని ఇక్కడికి వచ్చాం. వీరికి ఇష్టం వచ్చినట్టు అంతా ప్లాన్ చేసుకున్నారు. వీరి వెనక ఎవరో ఉన్నారు. ఇదంతా మోసం. ఇలా చేయడం భావ్యమేనా? మా టీమ్ అంతా ఫూల్స్ అని మీ ఉద్దేశమా?’ అని సీరియస్ అయ్యారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్’ ప్రోగ్రామ్కి విచ్చేసి, అక్కడి పరిస్థితులపై ఇలా స్పందించారాయన. ఈయనతోపాటు ‘పెళ్లిసందD’ చిత్ర బృందం ఈ షోలో పాల్గొంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. యాంకర్ సుమతో ఈ టీమ్ చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. సరదాగా సాగుతూనే ఉత్కంఠ పెంచుతోంది.
‘యాపిల్ పడినపుడే న్యూటన్ గ్రావిటీని కనిపెట్టాడు. యాపిల్ ఎక్కడ పడాలో నేను కనిపెట్టాను’ అని చెప్పి రాఘవేంద్రరావు నవ్వులు పూయించారు. ‘అందంగా ఉన్నారు. మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు’ అని హీరోహీరోయిన్లు రోషన్, శ్రీలీలని సుమ అడుగుతుంది. ఇద్దరూ తమదైన స్టైల్లో సమాధానం చెప్పి అలరించారు. ఇలా ఎంతో సరదాగా సాగుతున్న ఈ వీడియోలో ఉత్కంఠభరిత సీన్ ప్రత్యక్షమవుతుంది. ‘ఇక్కడ జరిగేది చీటింగ్. మా టీమ్ అంతా ఫూల్స్లా కనపడుతున్నామా?’ అంటూ కోపంతో షో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడతారు రాఘవేంద్రరావు. ఫీలైన సుమ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మరి అక్కడ ఏం జరిగింది? రాఘవేంద్రరావు ఎందుకు కోపడ్డారు? సుమ ఏం చేసింది? తెలియాలంటే అక్టోబరు 2 (శనివారం) రాత్రి 9:30 ని.లు వరకు ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.