Raghavendra Rao: సుమ ప్రోగ్రామ్‌పై కోప్పడ్డ రాఘవేంద్రరావు!

తమ బృందాన్ని మోసం చేశారంటూ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆరోపించారు. ‘డబ్బులొస్తాయని ఇక్కడికి వచ్చాం.

Published : 30 Sep 2021 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ బృందాన్ని మోసం చేశారంటూ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆరోపించారు. ‘డబ్బులొస్తాయని ఇక్కడికి వచ్చాం. వీరికి ఇష్టం వచ్చినట్టు అంతా ప్లాన్‌ చేసుకున్నారు. వీరి వెనక ఎవరో ఉన్నారు. ఇదంతా మోసం. ఇలా చేయడం భావ్యమేనా? మా టీమ్‌ అంతా ఫూల్స్‌ అని మీ ఉద్దేశమా?’ అని సీరియస్‌ అయ్యారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌కి విచ్చేసి, అక్కడి పరిస్థితులపై ఇలా స్పందించారాయన. ఈయనతోపాటు ‘పెళ్లిసందD’ చిత్ర బృందం ఈ షోలో పాల్గొంది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. యాంకర్‌ సుమతో ఈ టీమ్‌ చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. సరదాగా సాగుతూనే ఉత్కంఠ పెంచుతోంది.

‘యాపిల్‌ పడినపుడే న్యూటన్‌ గ్రావిటీని కనిపెట్టాడు. యాపిల్‌ ఎక్కడ పడాలో నేను కనిపెట్టాను’ అని చెప్పి రాఘవేంద్రరావు నవ్వులు పూయించారు. ‘అందంగా ఉన్నారు. మీకు ఎంతమంది ప్రపోజ్‌ చేశారు’ అని హీరోహీరోయిన్లు రోషన్‌, శ్రీలీలని సుమ అడుగుతుంది. ఇద్దరూ తమదైన స్టైల్‌లో సమాధానం చెప్పి అలరించారు. ఇలా ఎంతో సరదాగా సాగుతున్న ఈ వీడియోలో ఉత్కంఠభరిత సీన్‌ ప్రత్యక్షమవుతుంది. ‘ఇక్కడ జరిగేది చీటింగ్‌. మా టీమ్‌ అంతా ఫూల్స్‌లా కనపడుతున్నామా?’ అంటూ కోపంతో  షో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడతారు రాఘవేంద్రరావు. ఫీలైన సుమ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మరి అక్కడ ఏం జరిగింది? రాఘవేంద్రరావు ఎందుకు కోపడ్డారు? సుమ ఏం చేసింది? తెలియాలంటే అక్టోబరు 2 (శనివారం) రాత్రి 9:30 ని.లు వరకు ఆగాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని