Anubhavinchu Raja: నీ వల్లేరా.. నీ వల్లేరా

రాజ్‌ తరుణ్‌ కథా నాయకుడిగా శ్రీను గవి రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కశిష్‌ ఖాన్‌ కథానాయిక.

Updated : 07 Dec 2022 18:44 IST

రాజ్‌ తరుణ్‌ కథా నాయకుడిగా శ్రీను గవి రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనుభవించు రాజా’. అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రై.లి, శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కశిష్‌ ఖాన్‌ కథానాయిక. గోపీ సుందర్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర రెండో గీతాన్ని నటి పూజా హెగ్డే సోమవారం విడుదల చేశారు. ‘‘నీ వల్లే రా.. నే
తొలిసారి.. మబ్బుల్లో తిరుగుతున్నా’’ అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా.. రమ్య బెహరా ఆలపించారు. ‘‘విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలియజేశాయి. ఈ సినిమాకి కూర్పు: చోటా కే ప్రసాద్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని