Radheshyam: ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ వాయిదా.. ప్రకటించిన టీమ్‌

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ (Radheshyam) విడుదల వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో భారీ చిత్రాల విడుదలపై సందిగ్ధత నెలకొని...

Updated : 05 Jan 2022 11:57 IST

హైదరాబాద్‌: దేశంలో మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వాయిదా పడగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో పాన్‌ ఇండియా చిత్రం చేరింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ (Radheshyam) విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

‘‘రాధేశ్యామ్‌ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు గడిచిన కొన్నిరోజుల నుంచి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. కానీ ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల రీత్యా చిత్రాన్ని వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి మీ ముందుకు వస్తాం’’ అని టీమ్‌ తెలిపింది.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్‌’కు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమైన ఈసినిమాలో ప్రభాస్‌ సరసన ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే (Pooja Hegde) నటించారు. ప్రేమ, విధికి మధ్య ఉన్న సంఘర్షణలతో విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరణ్, హిందీ వెర్షన్‌కు మిథున్‌ స్వరాలు అందించారు. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే బాలీవుడ్‌ చిత్రాలు ‘జెర్సీ’, ‘పృథ్వీరాజ్‌’ వాయిదా పడ్డాయి.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని