Tillu Square: కొత్త తేదీకి ‘టిల్లు స్క్వేర్‌’

‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో అలరించేందుకు సమాయత్తమవుతున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

Updated : 27 Jan 2024 11:12 IST

‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో అలరించేందుకు సమాయత్తమవుతున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే దీన్ని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సిద్ధు, అనుపమ కలిసి ఉన్న ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది.‘‘డీజే టిల్లు’లా అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరించేలా ఉంటుంది ‘టిల్లు స్క్వేర్‌’. కచ్చితంగా ఇది మరో మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, ఛాయాగ్రహణం: సాయి ప్రకాశ్‌ ఉమ్మడిసింగు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని