Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్‌ క్లారిటీ!

2024 ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్‌ పోటీ చేయబోతున్నారన్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

Published : 02 Jul 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2024 ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు పోటీగా కుప్పం నియోజకవర్గం నుంచి నటుడు విశాల్‌ (Vishal) రంగంలోకి దిగబోతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలోనూ ఇది ట్రెండింగ్‌ టాపిక్‌గా మారింది. దీంతో ఈ విషయంపై విశాల్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవమేనని స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నానని, కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాననే వదంతులు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఖండిస్తున్నా. రాజకీయాలకు సంబంధించి నన్ను ఇప్పటివరకూ ఎవరూ కలవలేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నా. ఏపీ పాలిటిక్స్‌లోకి రావాలని, చంద్రబాబు నాయుడుపై పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని విశాల్‌ తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘సామాన్యుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశాల్‌. ప్రస్తుతం ‘లాఠి’, ‘తుప్పరివాలన్‌ 2’ (తెలుగులో డిటెక్టివ్‌ 2) తదితర చిత్రాలతో విశాల్‌ బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని