Chandrababu: రైతులకు గోనె సంచులు ఇవ్వలేని సీఎం.. 3 రాజధానులు కడతారా?: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్‌ మూలన పడేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు.

Published : 16 Aug 2023 20:32 IST

కోనసీమ: పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్‌ మూలన పడేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్‌ అసమర్థ పాలన రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. మండపేట రాజారత్నం సెంటర్‌ నుంచి కలవపువ్వు సెంటర్‌ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం కలవపువ్వు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘పురుషోత్తపట్నం ప్రాజెక్టులో నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. వైకాపా పాలనలో రైతులు అప్పులపాలయ్యారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రైతులకు కనీసం గోనెసంచులు కూడా ఇవ్వలేని ఈ సీఎం.. 3 రాజధానులు కడతారా? రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌ వెంటిలేటర్‌పై ఉంది’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు