‘పాలమూరు’పై విపక్షాలది వితండవాదం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది వితండవాదమని, ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
మంత్రి నిరంజన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలది వితండవాదమని, ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో తక్కువ ముంపు-ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. అన్ని విఘ్నాలను దాటుకుని ప్రాజెక్టులో మొదటి పంపు ప్రారంభించినా విపక్షాలు దుష్ప్రచారాలను ఆపడం లేదని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. పాలమూరుకు నీళ్లొస్తే విపక్ష నేతల రాజకీయ జీవితాలు శాశ్వతంగా కూలిపోతాయనే భయంతోనే విషప్రచారం చేస్తున్నారని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుండెపోటుతో జనగామ జడ్పీ ఛైర్మన్ మృతి
జనగామ జిల్లా పరిషత్తు ఛైర్మన్, భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్టేషన్ ఘన్పూర్లో గెలుపొందిన కడియం శ్రీహరితో కలిసి పాల్గొన్నారు. -
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.