కొత్త పార్లమెంటు ‘మోదీ మల్టీప్లెక్స్’
కొత్త పార్లమెంటు భవనం గందరగోళంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు.
ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్లు ఉండాలి: జైరాం రమేశ్
ఈనాడు, దిల్లీ: కొత్త పార్లమెంటు భవనం గందరగోళంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. వాస్తవానికి అది మోదీ ఉద్దేశాలను చాలా ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. దీన్ని ‘మోదీ మల్టీప్లెక్స్’ లేదంటే ‘మోదీ హోటల్’ అని పిలవాలి. ప్రత్యేక సమావేశాల సందర్భంగా పార్లమెంటు లోపల, బయట లాబీల్లో పూర్తి గందరగోళం కనిపించింది. ఉభయసభల్లోని హాళ్లు తగిన విధంగా లేకపోవడం వల్ల సభ్యులు ఒకరిని ఒకరు చూసుకోవాలంటే బైనాక్యులర్లు ఉపయోగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాత పార్లమెంటు భవనంలో సభ్యులు పరస్పరం మాట్లాడుకోవడానికి అనువైన వాతావరణం ఉండేది. ఒక సభ నుంచి మరో సభకు, సెంట్రల్ హాల్, ఇతర కారిడార్లకు వెళ్లడం సులభంగా ఉండేది. పార్లమెంటును విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఆ బంధం కొత్త భవనంలో పూర్తిగా లోపించింది. పాత భవనం గోళాకారంలో ఉండటంవల్ల మనం ఎక్కడ దారి తప్పినా చివరకు మొదటికి వచ్చే వాళ్లం. ఇప్పుడు కొత్త భవనంలో ఒకసారి దారితప్పితే అడవిలో దారి తప్పినట్లే అవుతుంది. పాత భవనంలోకి వెళ్లడం కోసం ఎదురుచూస్తున్నా. పార్టీలకు అతీతంగా చాలా మంది సభ్యులు కూడా ఇదే భావన వ్యక్తంచేస్తున్నారు. ఈ పార్లమెంటును ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలన్నది బహుశా 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కనుక్కోవచ్చు’’ అని జైరాం ట్విటర్లో పేర్కొన్నారు. పార్లమెంటుకు వ్యతిరేకంగా మాట్లాడడం కాంగ్రెస్కు ఇది మొదటిసారి కాదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
KCR: ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత కేసీఆర్ (KCR)ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. -
Election Commision: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ ఎన్నికల కోడ్ను ఈసీ ఎత్తివేసింది. -
SampathReddy: గుండెపోటుతో భారాస జనగామ అధ్యక్షుడి కన్నుమూత
జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. -
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. -
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పోలీసు కేసు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (MLA Kaushik Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
TS News: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు.. ఇక ముఖ్యమంత్రే తరువాయి!
తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్ను అందజేశారు. -
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్రెడ్డి
కామారెడ్డిలో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి చరిత్ర సృష్టించామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో భారాస (BRS) ముఖ్యనేతలు ఇవాళ సమావేశమయ్యారు. -
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
ఇండియా కూటమి పార్టీలతో కలిసి రాకపోవడం వల్లే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. -
Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి
లోక్సభ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. -
PM Modi: కుటుంబం బాధలో ఉన్నా.. పార్టీని గెలిపించారు: నడ్డాపై ప్రధాని ప్రశంసలు
భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
Yuvagalam: తుపాను ఎఫెక్ట్.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయత్రికు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. -
Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. -
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!
-
Sudheer Babu: నేను చేసినట్టు ఏ హీరో కూడా యాక్షన్ చేయలేరు: సుధీర్బాబు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Armed Forces: సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచుతాం : మోదీ
-
KCR: ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్
-
Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన