బిధూడీపై కఠినచర్యకు విపక్షాల ఒత్తిడి
లోక్సభలో బీఎస్పీ సభ్యుడు దానిశ్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ రమేశ్ బిధూడీపైన కఠినచర్య తీసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు శనివారం ఒత్తిడి పెంచాయి.
సస్పెన్షన్ కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు, ట్వీట్లు
ప్రధానిని కించపరిచి మమ్మల్ని రెచ్చగొట్టారు : భాజపా
దిల్లీ: లోక్సభలో బీఎస్పీ సభ్యుడు దానిశ్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ రమేశ్ బిధూడీపైన కఠినచర్య తీసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు శనివారం ఒత్తిడి పెంచాయి. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని ‘ఇండియా’ కూటమి కోరుతోంది. బిధూడీని తక్షణం సస్పెండు చేయాలంటూ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అయిన కె.సురేశ్ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సభలో ఈ ఘటన జరిగినపుడు ప్యానెల్ స్పీకర్ స్థానంలో ఈయనే ఉన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా టీఎంసీ, ఎన్సీపీ తదితర పార్టీల సభ్యులు బిధూడీని సస్పెండు చేయాల్సిందేనంటూ ప్రకటనలు, ట్వీట్లు చేశారు. బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భాజపా సభ్యుడు బిధూడీ ప్రవర్తనను వీధిరౌడీలతో పోల్చారు. ప్రముఖ ముస్లిం సంస్థ ‘జమియత్ ఉలేమా ఏ హింద్’ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సిగ్గుచేటు ఘటనగా తెలిపింది. ‘‘ముస్లింలపై తీవ్రమైన విద్వేషం ఇపుడు ప్రజాస్వామ్య ఆలయం దాకా కూడా చేరింది. బిధూడీపై కఠినచర్య తీసుకోవడం స్పీకర్కు రాజ్యాంగపరమైన నైతిక బాధ్యత’’ అని జమియత్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు.. విపక్షాలపై భాజపా ఎంపీ నిశికాంత్ దుబే ఎదురుదాడికి దిగారు. సభలో దానిశ్ అలి వైఖరిని ఆయన ప్రశ్నించారు. బీఎస్పీ ఎంపీతోపాటు టీఎంసీ, డీఎంకే వంటి పార్టీల వ్యాఖ్యలపై విచారణకు ఓ కమిటీ నియమించాలని స్పీకర్ను కోరుతూ ట్విటర్లో ఓ లేఖ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అలీ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా అధికార పార్టీ సభ్యుడిని రెచ్చగొట్టారని నిశికాంత్ దుబే అన్నారు. కాగా, తాను ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని బీఎస్పీ ఎంపీ దానిశ్ అలీ దీన్ని ఖండించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సైతం భాజపా వైఖరిని సమర్థిస్తూ ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. ప్రధాని మోదీ, హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్లపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. రాహుల్గాంధీతోపాటు ఏ ప్రతిపక్ష నేత అయినా వీటిని ఖండించారా అని ఆయన ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో త్వరలో నిశ్శబ్ద యుద్ధం
‘‘సైకో జగన్.. ధనవంతులకు, పేదలకు యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది. అది.. జగన్కు, పేదలకు మధ్య జరగనుంది. -
‘మాకెందుకు జగన్?’
‘ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే..’, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పేరిట వైకాపా నేతలు, వాలంటీర్లు రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. సీఎం మేనమామ రవీంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో మాత్రం ‘మాకెందుకు జగన్?’ అంటున్నారు. -
బడిలో ‘జగనే ఎందుకు కావాలి?’
తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని వేంబాకం ఉన్నత పాఠశాలలో ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలు తావిచ్చింది. -
మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభం
ప్రధాని మోదీ ఎక్కడుంటే అక్కడ అశుభమేనని, పవిత్ర కార్యాలకు ఆయన్ను భాజపా దూరం ఉంచాలంటూ జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్రవణ్కుమార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ను నడపగలిగే సరైన నేత ఖర్గే
రానున్న చరిత్రాత్మక సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నడపగలిగే సరైన నేత మల్లికార్జున ఖర్గే అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. -
అది జగన్ను ఆటాడేసుకునే కార్యక్రమంగా మారింది
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్తా సీఎం జగన్ను సామాజిక మాధ్యమాల్లో ఆటాడేసుకునే కార్యక్రమంగా మారిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. -
ఎస్టీ ఉపప్రణాళిక నిధులను పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం
గిరిజనుల అభ్యున్నతికి కేంద్రం మంజూరు చేస్తున్న ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ధ్వజమెత్తారు. -
విశాఖ నుంచే మరోసారి ఎంపీగా పోటీ
వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. -
రాజీనామా చేసిన వాలంటీర్లు తెదేపాలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సంజీవరాయునిపేట పరిధిలో పనిచేస్తూ రాజీనామా చేసిన వాలంటీర్లు వి.ఉదయకిరణ్, కె.రాధిక, ఎస్.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి బుధవారం తెదేపాలో చేరారు. -
1న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన విస్తృతస్థాయి సమావేశాన్ని డిసెంబరు 1న మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్
వైయస్ఆర్ జిల్లా పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. -
జగన్ అండతోనే దళితులపై అకృత్యాలు
సీఎం జగన్ అండ చూసుకొని, ఆయన మెప్పు కోసమే వైకాపా నేతలు దళితులపై దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్బాబు మండిపడ్డారు. -
సీఎంపై సర్పంచి ‘పంచ్లు’
‘ఒక్క రోడ్డు లేదు. విద్యుత్తు ఛార్జీలు రూ. 500 నుంచి రూ.5 వేలకు పెరిగాయి. అన్నింటి ధరలూ పెరుగుతున్నాయి. ప్రజల ఖాతాల్లో డబ్బులైతే పడుతున్నాయి. -
నిరాడంబర దుస్తులు ధరించినా.. వారంతా సంపన్నులే
కొందరు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్రధారణ, వారు ధరించిన సాధారణ చేతిగడియారాలు చూసి వారిని తక్కువగా అంచనా వేయకూడదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.