భాజపా తొలి జాబితాలో 110 పేర్లు!
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
16 రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖరారు కొలిక్కి?
తెల్లవారుజాము దాకా కొనసాగిన చర్చలు
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం రాత్రి 10.30కు మొదలైన ఈ భేటీలో దాదాపు 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై శుక్రవారం తెల్లవారుజాము నాలుగింటి వరకు కమిటీ చర్చలు జరిపింది. ఈ సమావేశానికి ముందే హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రధాని నివాసంలో మోదీని కలిసి చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలాచోట్ల సిటింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా చర్చల్లో యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్గఢ్, దిల్లీ, గోవా, ఉత్తరాఖండ్లోని స్థానాలపై ముందుగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో సీట్లపై స్థానిక ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన ఉండవచ్చు.
వారణాసి నుంచి మోదీ మూడోసారి..
ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షల మెజార్టీతో ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సారి వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా (గాంధీనగర్), రాజ్నాథ్ సింగ్ (లఖ్నవూ) తమ పాత స్థానాల నుంచే మళ్లీ బరిలోకి దిగనున్నారు. అలాగే అమేఠీ స్థానంపైనా సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ స్మృతి ఇరానీయే మళ్లీ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఎంపీల పనితీరు, రాజకీయ అవసరాల దృష్ట్యా గణనీయ సంఖ్యలో ప్రస్తుత సభ్యులను పక్కనపెట్టే అవకాశాలున్నాయి. భాజపాకు కీలక మిత్రపక్షాలు ఉన్న బిహార్, మహారాష్ట్రలతోపాటు పొత్తుల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇంకా చర్చకు రాలేదు. ఉత్తర్ప్రదేశ్లో మిత్రపక్షాలకు 6 స్థానాలు కేటాయించే అవకాశముంది. అధికారికంగా ఇంకా కమలదళంతో కలవని జయంత్సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ వాటా కూడా ఇందులో ఉంది. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన శశిథరూర్పై ఈసారి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బరిలోకి దిగే అవకాశమున్నట్లు వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. -
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. -
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. -
పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి నియమితులయ్యారు. -
నిర్ణేతలు బీసీలే!
బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్లోని 8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహరాజ్గంజ్లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు. -
ప్రజా విశ్వాసమే నా సంపద
ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే. -
మంచిరోజులు వస్తున్నాయి.. మోదీ వెళ్లిపోతున్నారు: కేజ్రీవాల్
త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో 59% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
దేశం మార్పు తుపాను చూస్తోంది: రాహుల్
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నవీన్ పట్నాయక్ చుట్టూ అవినీతి కోటరీ
రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. -
ఫరీద్కోట్ లోక్సభ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టి
పంజాబ్లోని ఫరీద్కోట్ (ఎస్సీ) లోక్సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్కే సీపీఐ మద్దతు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్