మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా
‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి.
మహనీయులు పుట్టిన నేలను మలినం చేశారు
పోలవరం లేకపోతే.. కృష్ణా డెల్టా మొత్తం ఎడారే
రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు
పామర్రు, ఉయ్యూరు ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్-అమరావతి, మచిలీపట్నం: ‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రిపదవులు, ఎక్కువ దాడులు చేస్తే.. పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి రౌడీయిజం కావాలా? ఈ ఎన్నికల్లో మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా? సంక్షేమానికా.. సంక్షోభానికా? అనేది ప్రజలంతా నిర్ణయించుకోవాలి. ఈ గంజాయి మొక్కలను పీకేద్దాం. ఈ అయిదేళ్లలో అభివృద్ధి గురించి జగన్ ఒక్కసారైనా మాట్లాడారా? అమరావతి నిర్మాణం జరిగితే.. కృష్ణాజిల్లాలో భూములకు విలువ పెరిగేది. కానీ.. అమరావతి రాజధానితో ఈ గంజాయి బ్యాచ్ ఆడుకుంది. మూడు గుంతలు పూడ్చలేరు గానీ, మూడు రాజధానులు కడతారా? ప్రజలంతా ఆలోచించాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు, ఉయ్యూరుల్లో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటా
‘తెదేపా హయాంలో పోలవరాన్ని 72% పూర్తిచేసి అందిస్తే.. జగన్ దాన్ని అక్కడే ఆపేశారు. తెదేపా ప్రభుత్వం కొనసాగితే 2022లోనే పోలవరం ద్వారా నీళ్లు ఇచ్చేవాళ్లం. పోలవరం లేకపోతే.. కృష్ణాడెల్టా మొత్తం ఎడారిగా మారిపోతుంది. ఈ అయిదేళ్లలో ఎప్పుడూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ధాన్యం కొనడం లేదు.. ఏంటీ అరాచకం? అధికారంలోకి రాగానే.. అన్నదాతకు ఏటా రూ.20వేలు ఇస్తాను. రైతు కూలీలు, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి.. ఆదుకుంటా. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తా
‘యువతకు జాబ్ క్యాలెండర్, డీఎస్సీ అని జగన్ మోసగించారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అయిదేళ్లలో 20 లక్షల కొలువులు అందిస్తాను. మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. పిల్లలకు ఉద్యోగాల్లేక.. మీరు కూలి చేసి వారికి డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితికి జగన్ తీసుకొచ్చారు’ అని ధ్వజమెత్తారు.
మంచి నేతలంతా వైకాపాను వీడుతున్నారు
‘కొనకళ్ల నారాయణరావు, దేవినేని ఉమా లాంటి నేతలకు కొన్ని కారణాల వల్ల ఈసారి టికెట్లు ఇవ్వలేకపోయాం. అయినా.. వాళ్లు ఏమీ మాట్లాడకుండా పార్టీ జెండా మోస్తూ.. సైనికుల్లా పనిచేస్తున్నారు. వాళ్లను నేను మరచిపోను. జగన్ దెబ్బకు అమరావతి పోయింది, పోలవరం పోయిందని గుర్తించి.. వైకాపా లోక్సభ టికెట్ ఇస్తామన్నా.. వద్దని బయటకొచ్చిన మంచి వ్యక్తి బాలశౌరి. వైకాపాలో ఉంటే జాతికి ద్రోహం చేసినట్టేనని భావించి కొలుసు పార్థసారథి బయటకొచ్చారు. మనకు ఇలాంటి మంచి నేతలు కావాలి. కానీ.. జగన్కు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ కావాలి. అందుకే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైకాపాను వదిలేసి బయటకొస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
గుడివాడలో ఏంటీ అరాచకం
‘గుడివాడలో గంజాయి తాగే బ్యాచ్ కళాశాలకు వెళ్లే ఓ విద్యార్థినిని రోజూ వేధిస్తుంటే.. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ అమ్మాయిని నడిరోడ్డుపై ఆ గంజాయి బ్యాచ్ హేయంగా అవమానించారు. విద్యార్థిని తండ్రి నడిపే దుకాణంలో గంజాయి పెట్టి, పోలీసుల సహకారంతో మరింత వేధించారు. ఏంటీ అరాచకం? ఈ రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. అందుకే.. ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే పొత్తు పెట్టుకున్నాం’ అని తెలిపారు.
ముస్లింలకు నా విజ్ఞప్తి ఒక్కటే
‘గతంలో ఎన్డీయేలో తెదేపా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకే ఎక్కువ మేలు జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను రెండోభాషగా చేసింది తెదేపానే. ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టా. హైదరాబాద్, విజయవాడ, కడపలో హజ్ హౌస్లు కట్టించా. రంజాన్ తోఫా, ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చాం. మైనారిటీ విద్యార్థులకు విదేశీవిద్య, ఇమామ్లకు పారితోషికం ఇచ్చింది తెదేపానే. జగన్ మాటలు నమ్మొద్దు. నిన్న నందికొట్కూరులో ఒక బిడ్డ నమాజుకు వెళ్లి వస్తుంటే.. వైకాపా నాయకుడు బురఖా ఎత్తిచూసి అవమానించాడు. ఇదేంటని నిలదీసినందుకు.. ఆమె కుటుంబసభ్యులను చెప్పుతో కొట్టడమేంటి’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కంటే ముందు గొడ్డలి వస్తోంది
‘పవన్ లాంటి వ్యక్తినీ అవమానించేలా జగన్ మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు తలచుకుంటే.. జగన్ పరిస్థితేంటి? జగన్ ఆకాశంలో తిరిగితే.. రోడ్డు పక్కనున్న చెట్లను నరికేస్తున్నారు. కర్ఫ్యూ పెడుతున్నారు. ఇలాంటి వాళ్లను నా జీవితంలో చూడలేదు. జగన్ కంటే.. ముందు గొడ్డలి వస్తోంది. ఫ్యాన్ను తీసేసి.. గొడ్డలే మీ పార్టీ గుర్తుగా పెట్టుకోండి..’ అని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా అధికారుల తీరు మారాలి
ఇప్పుడు జగన్కు ఏ అధికారమూ లేదనీ, ఏదైనా ఎన్నికల సంఘమే చేయాలని చంద్రబాబు తెలిపారు. అధికారులకు అన్ని పార్టీలూ సమానమేనని, అయినా కొందరు జగన్ కోసమే పనిచేస్తున్నారని, రేపో ఎల్లుండో ఆయన మాజీ సీఎం అవుతారన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇంగ్లిష్ కాదు.. ఐటీ, ఏఐ నేర్పించాలి
‘జగన్ ఇంగ్లిష్ నేర్పిస్తారట, ఈతరం వాళ్లకు ఇంగ్లిష్ నేర్పించేదేంటి? ఇప్పుడు యువతకు ఐటీ నేర్పించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కావాలి. అవన్నీ నేను నేర్పిస్తా. జగన్ రాతియుగం వైపు తీసుకెళ్తే.. నేను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తా. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి.. తెలుగు పిల్లలందరికీ అండగా ఉంటాను’ అని చంద్రబాబు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. -
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. -
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పులు చేస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్కు ఫిర్యాదు చేశారు. -
పీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఈవీ నర్సింహాచారి నియమితులయ్యారు. -
నిర్ణేతలు బీసీలే!
బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్లోని 8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. పోలింగ్ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్హర్, వైశాలి, గోపాల్గంజ్, సివాన్, మహరాజ్గంజ్లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు. -
ప్రజా విశ్వాసమే నా సంపద
ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే. -
మంచిరోజులు వస్తున్నాయి.. మోదీ వెళ్లిపోతున్నారు: కేజ్రీవాల్
త్వరలో దేశానికి ‘మంచిరోజులు రాబోతున్నాయి..మోదీజీ వెళ్లిపోతున్నారు’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. -
ఐదో విడతలో 59% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ కింద ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం నిర్వహించిన పోలింగులో 59% మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
దేశం మార్పు తుపాను చూస్తోంది: రాహుల్
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అండగా నిలిచారన్న సంగతి విస్పష్టమని, దేశం మార్పు తుపానును చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. -
నవీన్ పట్నాయక్ చుట్టూ అవినీతి కోటరీ
రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. -
ఫరీద్కోట్ లోక్సభ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టి
పంజాబ్లోని ఫరీద్కోట్ (ఎస్సీ) లోక్సభ ఎన్నిక ప్రత్యేక పరిశీలకుడిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నియమిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్కే సీపీఐ మద్దతు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్