తెదేపాను వీడేది లేదు: వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే... తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 08 Apr 2024 06:55 IST

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే... తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, తెదేపాను వీడే ప్రసక్తే లేదని నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు పార్లమెంటు, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులుగా తాను, ప్రశాంతిరెడ్డి పోటీలో ఉన్నామని, తామిద్దరం సైకిల్‌ గుర్తుపై గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో తమకు వస్తున్న ఆదరణ చూసి వైకాపా తట్టుకోలేకపోతోందన్నారు. తెదేపాలో చేరికలు చూసి కొందరు అసూయ పడుతున్నారని తెలిపారు. తెదేపా అభ్యర్థులుగా తామిద్దరం విజయం సాధించబోతున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు