Mary Kom: అమ్మగా ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నా
ఇంటర్నెట్ డెస్క్: ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువు. మొన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్లో బిజీబిజీగా గడిపిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఇప్పుడు తన మగ కవల పిల్లలకు బ్యాడ్మింటన్ నేర్పించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఆడుతున్న వీడియోని ట్వీట్ చేస్తూ.. ‘‘నా ఇద్దరి కొడుకులతో బాడ్మింటన్ ఆడుతున్నా. ఆ ఆటలో నాకంత ప్రావిణ్యం లేకపోయినప్పటికీ..వారితో ఆడుతున్నా. ఎప్పుడైనా సరే పిల్లలు వెళ్లాల్సిన మార్గంలో శిక్షణ ఇవ్వాలి’’ అంటూ ఓ అమ్మగా తాను నిర్వర్తించే బాధ్యతను ట్విటర్లో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువు. మొన్నటి వరకూ టోక్యో ఒలింపిక్స్లో బిజీబిజీగా గడిపిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఇప్పుడు తన మగ కవల పిల్లలకు బ్యాడ్మింటన్ నేర్పించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో ఆడుతున్న వీడియోని ట్వీట్ చేస్తూ.. ‘‘నా ఇద్దరి కొడుకులతో బాడ్మింటన్ ఆడుతున్నా. ఆ ఆటలో నేర్పు లేకపోయినప్పటికీ..వారితో ఆడుతున్నా. ఎప్పుడైనా సరే పిల్లలు వెళ్లాల్సిన మార్గంలో శిక్షణ ఇవ్వాలి’’ అంటూ ఓ అమ్మగా తాను నిర్వర్తించే బాధ్యతను ట్విటర్లో పంచుకున్నారు. 2000లో ఫుట్బాల్ ఆటగాడు కరుంగ్ ఆంఖోలర్ ను వివాహం చేసుకున్నామె... 2007లో ఇద్దరు మగ కవల పిల్లలు, 2013లో మగబిడ్డకు జన్మిచ్చారు. 2018లో ఆ దంపతులిద్దరూ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యపతకం సాధించారు మేరీకోమ్. బాక్సింగ్ క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గానూ భారత ప్రభుత్వం నుంచి... 2006లో పద్శశ్రీ, 2013లో పద్శభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..