Jasprit Bumrah: బుమ్రాపై ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్ ముద్ర.. కానీ, ఆ రోజు..: రవిశాస్త్రి
టీమ్ఇండియా స్టార్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో భారత్ నుంచి అగ్రస్థానం సాధించిన తొలి పేసర్గా జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్గానూ అవతరించాడు. 2018లో టెస్టుల్లోకి అడుగు పెట్టిన బుమ్రా ఇప్పటి వరకు 34 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 155 వికెట్లు తీశాడు. భారత ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఉన్న సమయంలోనే బుమ్రా సుదీర్ఘ ఫార్మాట్లోకి వచ్చాడు. అంతకుముందు వరకూ బుమ్రాపై ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్గానే ముద్ర వేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రవిశాస్త్రి (Ravi Shastri) వెల్లడించాడు.
‘‘నేను తొలిసారి బుమ్రాతో మాట్లాడిన రోజు ఇప్పటికీ గుర్తుంది. అది కోల్కతాలో అనుకుంటా! టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి ఉందా? లేదా? అని అడిగా. ‘అలాంటి అవకాశమే వస్తే నా జీవితంలో అతిపెద్ద రోజుగా మిగిలిపోతుంది’ అని బుమ్రా అన్నాడు. అప్పటి వరకూ అతడిని కేవలం ‘వైట్ బాల్’ స్పెషలిస్ట్గానే చూశారు. అతడికి ఇష్టం లేకపోయినా అలా ముద్ర వేసేశారు. కానీ, బుమ్రాలో వికెట్లు తీయాలనే కసి, ఆకలి ఉందని నాకు తెలుసు. దీంతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతడికి చెప్పా. దక్షిణాఫ్రికా పర్యటనకు తీసుకెళ్తానన్నా. బుమ్రా కూడా టెస్టు అరంగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. విరాట్తో కలిసి టెస్టులు ఆడాలనేది అతడి కోరిక. చాలా మంది క్రికెటర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతాలు చేసిన వారున్నారు. ఎవరికీ ఆ గణాంకాలు గుర్తుండవు. కానీ, టెస్టుల్లో ఎలా ఆడారనేదే అభిమానులు చూస్తారు. సుదీర్ఘ ఫార్మాట్కు అంత విలువ ఉంది’’ అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు.
అప్పుడు సానబెట్టని వజ్రంలా కోహ్లీ
భారత జట్టు డైరక్టర్గా 2014లో రవిశాస్త్రి సేవలందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశీ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాలు సాధించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడు. విరాట్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడే విరాట్ కోహ్లీపై నా దృష్టిపడింది. నేను బాధ్యతలు తీసుకున్న రెండో నెలలోనే కోహ్లీకి ఓ విషయం చెప్పా. భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. ‘నిశితంగా గమనించు. ప్రతి అంశాన్నీ పరిశీలించు. సిద్ధంగా ఉండు’ అని కోహ్లీతో అన్నాను. అప్పటికి విరాట్ నాకు ఇంకా సానబెట్టని వజ్రంలా కనిపించాడు. సారథ్యం చేపట్టిన తర్వాత కోహ్లీ టెస్టు క్రికెట్పై పూర్తి స్థాయి దృష్టిసారించాడు. క్లిష్టమైన పిచ్లపైనా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ఆసీస్ లేదా పాకిస్థాన్ ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడుగా వ్యవహరించాం’’ అని మాజీ ప్రధాన కోచ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు