IPL 2023: బెన్స్టోక్స్ ఐపీఎల్ ఆడటం వల్ల ‘యాషెస్’కు ఇబ్బందేమీ లేదు: మెక్కల్లమ్
మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ భారీ మొత్తం వెచ్చించి మరీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను దక్కించుకొంది. అయితే, 16వ సీజన్కు అందుబాటులో ఉంటాడా..? కనీసం కొన్ని మ్యాచ్లైనా ఆడతాడా..? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఎందుకంటే మెగా టోర్నీ మే 28వ తేదీతో ముగుస్తుంది. ఇక జూన్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ సిరీస్ (Ashes Series) జరగనుంది. దీంతో మే చివరి వరకు టీ20 ఫార్మాట్లో ఆడి.. మరో పదిహేను రోజుల్లోనే టెస్టులు ఆడటం అంత సులువైన విషయం కాదు. అయితే, చెన్నై అభిమానుల అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడతానని బెన్ స్టోక్స్ ఇప్పటికే స్పష్టత ఇచ్చాడు. కానీ, యాషెస్ సన్నద్ధత గురించి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టెస్టు జట్టు కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాత్రం కంగారు అక్కర్లేదని తేల్చి చెప్పాడు. కివీస్తో టెస్టు సిరీస్లో మోకాలి గాయం కారణంగా కేవలం తొమ్మిది ఓవర్లనే బౌలింగ్ చేశాడు.
‘‘ఐపీఎల్లో ఆడటం వల్ల బెన్ స్టోక్స్కు నష్టమేమీ ఉండదని భావిస్తున్నా. సీఎస్కే వైద్య బృందంపై నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే, తమ ఆటగాళ్లకు సీఎస్కే ఇచ్చే ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. బెన్ స్టోక్స్ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. క్లిష్టపరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలను తీసుకొవాలనేది అతడికి తెలుసు. ఇది అతడి జీవితమే కదా..? అందుకే నాకు ఎలాంటి ఆందోళన లేదు. యాషెస్ సిరీస్లో అతడు కీలకంగా మారతాడు. కెప్టెన్సీ లేకపోతే ఇంకా మెరుగ్గా ఆడతాడు. ఆందోళనలు లేకుండా ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అతడి నాయకత్వంలో మైదానంలోకి దిగితే చాలు ఇంగ్లాండ్ యాషెస్ క్యాంపెయిన్ ఘనంగా ఉంటుంది. యాషెస్ స్క్రిప్ట్ రాసేందుకు మా కెప్టెన్ వేచి చూస్తుంటాడని భావిస్తున్నా’’ అని మెక్కల్లమ్ తెలిపాడు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ -16 సీజన్ ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి