Sania Mirza: సానియా వీడ్కోలులో షోయబ్‌ ఎక్కడ? ఇద్దరి మధ్యా దూరం పెరిగిందా?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వీడ్కోలు కార్యక్రమానికి ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ గైర్హాజరవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి.

Updated : 09 Mar 2023 09:16 IST

దిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా వీడ్కోలు కార్యక్రమానికి ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ గైర్హాజరవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి. వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు నడుస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సానియా వీడ్కోలు టెన్నిస్‌ మ్యాచ్‌కు, విందుకు షోయబ్‌ రాకపోవడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 5న ఎల్బీ స్టేడియంలో సానియా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. అదే రోజు రాత్రి సానియా విందు ఏర్పాటు చేసింది. ఈ రెండు కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు.. సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే షోయబ్‌ మాత్రం కనిపించకపోవడంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని