Dilip: ద్రవిడ్ మెచ్చిన కోచ్
మ్యాచ్ ముగిసిన అనంతరం.. డ్రెస్సింగ్ రూమ్లో జట్టంతా కూర్చుని ఉండగా.. ఓ వ్యక్తి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ, వారి వల్ల జట్టుకు ఎలా మేలు జరిగిందన్నది వివరిస్తూ.. ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తినింపుతూ చివరికి మ్యాచ్లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడి మెడలో ఓ పతకం వేయడం గమనించేవుంటారు
ఈనాడు క్రీడావిభాగం
మ్యాచ్ ముగిసిన అనంతరం.. డ్రెస్సింగ్ రూమ్లో జట్టంతా కూర్చుని ఉండగా.. ఓ వ్యక్తి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ, వారి వల్ల జట్టుకు ఎలా మేలు జరిగిందన్నది వివరిస్తూ.. ఉత్సాహపరుస్తూ, స్ఫూర్తినింపుతూ చివరికి మ్యాచ్లో అత్యుత్తమంగా ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన ఆటగాడి మెడలో ఓ పతకం వేయడం గమనించేవుంటారు. ప్రతి మ్యాచ్ అనంతరం బీసీసీఐ విడుదల చేసిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఫైనల్లో టీమ్ఇండియా ఓడిన అనంతరం.. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆటగాళ్లను ఓదారుస్తూ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన కోహ్లికి పతకం అందించిన వీడియో ఇప్పుడు విస్తృమవుతోంది. స్ఫూర్తిమంతమైన మాటలతో.. ఆటగాళ్లలో ప్రేరణ నింపుతున్న అతడే దిలీప్. టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్. అతడు తెలుగు వాడే. హైదరాబాద్లోని మల్కాజ్గిరి వాస్తవ్యుడు.
సాధారణంగా మ్యాచ్లో గెలిచిన జట్టు డ్రెస్సింగ్ రూమ్లో సందడి కనిపిస్తుంది. ఓడిన జట్టు నిరాశలో మునిగిపోతుంది. నెగ్గిన జట్టులోనూ బాగా ఆడిన ఆటగాళ్లు (బ్యాటర్ లేదా బౌలర్) కాస్త ఎక్కువ ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్లు తమ కిట్లు సర్దుకుని హోటల్కు బయల్దేరుతారు. అయితే మైదానంలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కీలకమే.. వారి భాగస్వామ్యం ముఖ్యమేనన్న సందేశాన్ని ఆటగాళ్లకు పంపడమే ఉత్తమ ఫీల్డర్ అవార్డు ఉద్దేశం. ‘‘అవార్డు ఆలోచన నాలుగు నెలల కిందట ప్రారంభమైంది. ప్రపంచకప్ వీడియోలతో అందరికీ తెలిసింది. ప్రతి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో ఉత్తమ ఫీల్డర్కు పతకం ఇస్తున్నాం. మైదానంలో ఆటగాళ్లు ప్రదర్శించే పట్టుదల, స్ఫూర్తి గణాంకాలలో కనిపించకపోవచ్చు. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి తెలుస్తుంది. క్యాచ్లు పట్టడం, పరుగులు ఆపినందుకు మార్కులు వేయొచ్చు. కాని ఆటగాడు మైదానంలో ఎంత విలువ తీసుకొస్తున్నాడన్నదీ కీలకం’’ అన్నది దిలీప్ అభిప్రాయం.
క్రికెటర్ అవుదామనుకుని..: హైదరాబాద్ అండర్-25 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్కు బలమైన ఆర్థిక నేపథ్యమేమీ లేదు. పాఠశాల పిల్లలకు లెక్కల్లో ట్యూషన్లు చెబుతూ క్రికెట్ ఆడాడు. అండర్-25 జట్టుకు ఆడిన అనంతరం హెచ్సీఏ లీగ్స్లో క్లబ్ క్రికెట్ కొనసాగించాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు సహాయక ఫీల్డింగ్ కోచ్గా పనిచేశాడు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లెవెల్-1, లెవల్-2 కోచ్ శిక్షణ పూర్తిచేశాడు. లెవెల్-3 శిక్షణలో జాతీయ స్థాయిలో నంబర్వన్గా వచ్చాడు. భారత అండర్-19, మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఇండియా-ఎ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా ఎంపికవడం దిలీప్ కెరీర్లో మలుపు. అప్పట్లో ఇండియా-ఎకు రాహుల్ ద్రవిడ్ చీఫ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. దిలీప్ పని విలువలు, క్రమశిక్షణ ద్రవిడ్కు ఎంతగానో నచ్చడంతో అతనిపై నమ్మకం పెరిగింది. రెండేళ్ల క్రితం ద్రవిడ్ భారత జట్టుకు చీఫ్ కోచ్గా బాధ్యతలు చేపట్టగానే దిలీప్కు ఫీల్డింగ్ విధులు అప్పగించాడు. అప్పటికే ఎన్సీఏలో సీనియర్ ఫీల్డింగ్ కోచ్లు ఉన్నా.. బీసీసీఐ పెద్దల నుంచి సిఫార్సులు వస్తున్నా ద్రవిడ్ మాత్రం దిలీప్ వైపే మొగ్గుచూపాడు. ఫలితమే భారత జట్టు ఫీల్డింగ్, డ్రెస్సింగ్ రూమ్లో కనిపిస్తున్న మార్పు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..