IND vs AUS: మళ్లీ సరికొత్తగా
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుండొచ్చు.. ఆ పరాజయం వెంటాడుతుండొచ్చు.. కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్ దిశగా టీమ్ఇండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయమొచ్చింది.
రాత్రి 7 గంటల నుంచి
ఆసీస్తో భారత్ టీ20 సిరీస్
నేడే విశాఖలో తొలి మ్యాచ్
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి బాధను కలిగిస్తుండొచ్చు.. ఆ పరాజయం వెంటాడుతుండొచ్చు.. కానీ అది గతం. ఆ ఫలితాన్ని మర్చిపోయి మరో కప్ దిశగా టీమ్ఇండియా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన సమయమొచ్చింది. వచ్చే ఏడాది జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్పై గురి పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకు ఆసీస్ జట్టుతోనే అయిదు మ్యాచ్ల సిరీస్తో.. విశాఖపట్నం వేదికగా భారత్ మళ్లీ కొత్తగా పయనాన్ని మొదలెట్టనుంది. నేడే తొలి టీ20. ఇప్పుడు ఫార్మాట్.. ఆటగాళ్లు.. కోచ్లు.. ఇలా అన్నీ మారాయి. తెలుగు గడ్డపై నెగ్గి.. అనంతరం సిరీస్నూ దక్కించుకుని.. కంగారూ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు.. టీ20 ప్రపంచకప్ సన్నాహకాలనూ భారత్ మెరుగ్గా ఆరంభించాలన్నది అభిమానుల ఆశ.
విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి: ప్రపంచకప్ ముగిసిన నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ రూపంలో అభిమానులను అలరించేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. గురువారమే తొలి మ్యాచ్. ప్రపంచకప్లోని భారత్ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రమే ఈ సిరీస్ ఆడబోతున్నారు. ప్రపంచకప్లో ఇషాన్ రెండు మ్యాచ్లే ఆడగా.. ప్రసిద్ధ్కు ఆ అవకాశమూ రాలేదు. శ్రేయస్ అయ్యర్ టీ20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్లాడనున్నాడు. కోచ్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కమిన్స్, వార్నర్, మిచెల్ మార్ష్, హేజిల్వుడ్, స్టార్క్, గ్రీన్, కోచ్ మెక్డొనాల్డ్ ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యారు. ఆండ్రూ బోరెవెక్ తొలిసారి కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్తో పాటు డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం నేపథ్యంలో ఈ సిరీస్లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. పొట్టి కప్పు కంటే ముందు భారత్ 11 టీ20లే ఆడుతుంది. అందుకే మనకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే.
సూర్య ఏం చేస్తాడో?: వన్డే ప్రపంచకప్లో అంచనాలను అందుకోలేకపోయిన సూర్యకుమార్ 7 ఇన్నింగ్స్ల్లో కేవలం 106 పరుగులే చేశాడు. కానీ ఇప్పుడు తనకు అచ్చొచ్చిన టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. టీ20లో ప్రపంచ నంబర్వన్ బ్యాటర్గా ఉన్న సూర్య ఇప్పుడు జట్టుకు కెప్టెన్ కూడా. టీ20ల్లో జట్టును నడిపిస్తున్న హార్దిక్ గాయంతో దూరమవడంతో తొలిసారి జట్టును నడిపించే బాధ్యత సూర్యపై పడింది. బ్యాటింగ్లో, కెప్టెన్సీలో అతనెలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రపంచకప్ ఫైనల్లో స్లో బౌన్సర్లు వేసి.. డీప్ థర్డ్, ఫైన్ లెగ్లో ఫీల్డర్లను మోహరించి సూర్యను కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. అదే వ్యూహాన్ని ఈ సిరీస్లోనూ కొనసాగించొచ్చు. ఈ పరీక్షను అతనెలా ఎదుర్కుంటాడన్నది ఆసక్తికరం. దేశవాళీ క్రికెట్లో ముంబయి సారథిగా సూర్యకు అనుభవముంది. ఐపీఎల్లోనూ ముంబయికి తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు.
జట్టు కూర్పు ఎలా?: తొలి టీ20లో టీమ్ఇండియా కూర్పు ఆసక్తి రేపుతోంది. ఈ స్టేడియంలో ఇషాన్, రుతురాజ్ చెరో అర్ధశతకం సాధించారు. వికెట్కీపర్గా ఇషాన్ ఆడతాడు. కానీ యశస్వితో కలిసి ఓపెనింగ్ చేస్తాడా? వైస్ కెప్టెన్ రుతురాజ్ ఓపెనర్గా వస్తే ఇషాన్ మిడిలార్డర్లో ఆడతాడా? అన్నవి ప్రశ్నలు. కెప్టెన్ సూర్య మూడో స్థానంలో ఆడే అవకాశముంది. ఇక నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్ ఆడొచ్చు. బౌలింగ్లో ముకేశ్, అర్ష్దీప్, రవి బిష్ణోయ్కు పోటీ లేకపోవచ్చు. మూడో పేసర్గా అవేశ్ కంటే ప్రసిద్ధ్నే ఆడించే ఆస్కారముంది. అవేష్ కూడా కావాలనుకుంటే ముకేశ్ తప్పుకోవాల్సిందే. మరో స్పిన్నర్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లో ఎవరాడతారో చూడాలి.
తక్కువేం కాదు..: గత అయిదు టీ20ల్లో ఆసీస్పై మూడు సార్లు గెలిచినా.. ఈ ఫార్మాట్లో భారత్దే ఆధిపత్యం అయినా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేం. ప్రపంచకప్లో దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా టీ20ల్లోనూ ప్రమాదకరమే. ఈ సిరీస్కు కెప్టెన్ అయిన మాథ్యూ వేడ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే. స్టాయినిస్, టిమ్ డేవిడ్తో కలిసి అతను మెరుపు ముగింపునివ్వగలడు. గతంలో 7 టీ20ల్లో జట్టును నడిపించిన అనుభవమూ అతనికుంది. మ్యాక్స్వెల్ క్రీజులో నిలబడితే ఎంతటి విధ్వంసం సృష్టించగలడో తెలిసిందే. ఇక్కడ అతను ఓ అర్ధశతకమూ చేశాడు. షార్ట్తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. బౌలింగ్లో సీన్ అబాట్, ఎలిస్, బెహెండార్ఫ్, తన్వీర్ సంఘా ఆసీస్కు కీలకం.
తుది జట్లు (అంచనా)..
భారత్: ఇషాన్ (వికెట్కీపర్), యశస్వి, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్/సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్, ప్రసిద్ధ్/అవేష్, ముకేశ్
ఆస్ట్రేలియా: స్మిత్, షార్ట్, హార్డీ, ఇంగ్లిస్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్/వికెట్కీపర్), అబాట్, ఎలిస్, బెహెండార్ఫ్, తన్వీర్ సంఘా.
బౌలింగ్కే అనుకూలం
విశాఖ స్టేడియం బౌలింగ్కే అనుకూలించే ఆస్కారముంది. ఇక్కడ జరిగిన మూడు టీ20ల్లోనూ బంతితే ఆధిపత్యం. పేసర్లు, స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తుంది. మ్యాచ్కు వర్షం ముప్పు లేనట్లే. కొన్ని చినుకులు పడొచ్చు. ఇక్కడ టీ20ల్లో 2016లో శ్రీలంకపై, 2022లో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్.. 2019లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఛేదన జట్లు రెండుసార్లు గెలిచాయి
4
విశాఖలో ఆడిన అయిదు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయాలు.
9
2021 నుంచి భారత టీ20 జట్టుకు సారథిగా ఎంపికైన కెప్టెన్ల జాబితాలో సూర్యకుమార్ స్థానం.
15
ఆస్ట్రేలియాతో ఆడిన 26 టీ20ల్లో భారత్ విజయాలు. ప్రత్యర్థి 10 మ్యాచ్ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.
వీళ్లపై దృష్టి..
ఈ సిరీస్లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్పై ప్రత్యేక దృష్టి నిలవనుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానాన్ని త్రుటిలో కోల్పోయిన తిలక్.. టీ20ల్లో సత్తాచాటి వచ్చే ఏడాది ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇషాన్కూ ఈ సిరీస్ మంచి అవకాశం. వికెట్కీపర్ బ్యాటర్గా అతనికి పోటీనిచ్చే శాంసన్ ఇప్పుడు లేడు. జితేశ్ శర్మ ప్రత్యామ్నాయ వికెట్కీపరే. ఈ నేపథ్యంలో ఫామ్ కొనసాగిస్తే ఇషాన్కు తిరుగుండదు. ఓపెనర్ స్థానం కోసం యశస్వి, రుతురాజ్తో ఇషాన్ పోటీపడుతున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 29 టీ20ల్లో ఇషాన్ రెండు సార్లు మాత్రమే ఓపెనర్గా ఆడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం