IND vs PAK: న్యూయార్క్‌లో భారత్‌ X పాక్‌!

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో న్యూయార్క్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ తలపడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.

Published : 16 Dec 2023 07:34 IST

2024 టీ20 ప్రపంచకప్‌

దుబాయ్‌: వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో న్యూయార్క్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ తలపడే అవకాశాలున్నాయి. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ కప్‌లో తలపడుతున్న పది జట్లలో కొన్ని జట్లు తమ గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ అమెరికాలో ఆడే అవకాశాలున్నాయి. వీటిలో భారత్‌, పాకిస్థాన్‌ ఉండొచ్చని తెలిసింది. భారత్‌కు న్యూయార్క్‌కు మధ్య కాలమానంలో పదిన్నర గంటలు తేడా ఉండడంతో భారత్‌లో అభిమానులకు అనువుగా ఉండేటట్లు ఈ మ్యాచ్‌ను నిర్వహించబోతున్నారు. తుది షెడ్యూల్‌కు ముందు మార్పు చేర్పులు చేసే అవకాశం ఇంకా ఉంది. టోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్‌, అమెరికాల్లోని వేదికల్లో ఐసీసీ బృందం ఇప్పటికే పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించింది. విండీస్‌లో కొన్ని వేదికలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని