Virat Kohli : మిగతా మూడు టెస్టులకూ విరాట్‌ దూరం?

టీమ్‌ ఇండియాను ప్రస్తుతం గాయాల బెడద వెంటాడుతోంది. ఈ సమయంలో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న విరాట్‌.. మిగతా మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడా..?

Updated : 02 Feb 2024 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli).. మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా? దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోది. ఈ క్రమంలో మిగతా మ్యాచ్‌లకూ విరాట్‌ అందుబాటులో ఉండకపోవచ్చుననే వార్తలు భారత అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. కోహ్లీ ప్రస్తుతం భారత్‌లో లేడని.. చివరి మూడు టెస్టుల్లో ఆడేది అనుమానమేనని ఓ క్రీడా ఛానల్‌ పేర్కొంది. 

సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదు? నెట్టింట ఫ్యాన్స్ ఫైర్

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఓటమి.. మరోవైపు గాయాల బెడద టీమ్‌ఇండియాను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, జడేజా జట్టుకు దూరం అయ్యారు. కోహ్లీ.. మిగతా మ్యాచ్‌లకు అందుబాటులోకి రాకపోతే టీమ్‌ఇండియాకు పెద్ద లోటే. తొలి రెండు టెస్టులకు గాయం వల్ల ఎంపిక కాని షమీ.. ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ తెలియడం లేదు. మిగిలిన సిరీస్‌ కోసం జడేజా తిరిగి జట్టులోకి రావడం కూడా అనుమానమే అంటున్నారు.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు విశాఖ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది. తుది జట్టులో సర్ఫరాజ్‌కు అవకాశం దక్కలేదు. రజత్‌ పటీదార్‌ అరంగేట్రం చేశాడు. యశస్వి సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. సిరీస్‌లో వెనకబడిపోకుండా ఉండాలంటే ఈ టెస్టులో గెలిచి తీరాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని