IND vs PAK: అక్కడుంది రోహిత్ శర్మ.. బౌలర్లూ పారాహుషార్: పాక్ మాజీల హెచ్చరికలు
వరల్డ్ కప్లో (ODI World Cup 2023) దాయాదుల పోరు మొదలైంది. అతిపెద్ద మైదానం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ (IND vs PAK) జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్పై అద్భుతమైన శతకంతో అదరగొట్టిన టీమ్ఇండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మతో బౌలర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పాక్ మాజీలు హెచ్చరించారు. వరల్డ్ కప్లో (ODI World Cup 2023) భాగంగా భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. పాక్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో తమ బౌలర్లకు కీలక సూచనలు చేస్తూ మాజీ ఆటగాళ్లు వసీమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రోహిత్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. అలవోకగా పరుగులు చేస్తున్నాడు. ఎలాంటి రిస్క్ లేకుండానే అద్భుత షాట్లు కొట్టేస్తున్న రోహిత్కు బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కోహ్లీ కూడా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి ఊపు మీదున్నాడు. బంతిపై పూర్తి నియంత్రణతో ఆడుతున్నాడు. అయితే, కోహ్లీ కంటే రోహిత్ విభిన్న తరహా బ్యాటర్. ఇతర బ్యాటర్ల కంటే బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని వసీమ్ అక్రమ్ వ్యాఖ్యానించాడు.
‘‘రోహిత్ శర్మ అఫ్గాన్పై ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఇతర జట్లు ఒత్తిడికి గురి కావడం సహజమే. అతడికి బౌలింగ్ ఎక్కడ వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేయాల్సిందే’’ అని మిస్బా తెలిపాడు. ‘ఈ మ్యాచ్లో మీరు ఎలా అతడి దాడిని తట్టుకుంటారు? అని వసీమ్ అక్రమ్ ప్రశ్నకు సమాధానంగా.. ‘‘పాక్ బౌలింగ్ బలంగానే ఉంది.. మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా’ అని సమాధానం ఇచ్చాడు.
భారతే ఫేవరెట్.. కానీ పాక్కూ ఛాన్స్ ఉంది: రమీజ్ రజా
భారత్- పాకిస్థాన్ పోరులో ఎవరు గెలుస్తారనే అంచనాలను విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అలాగే ఆయా దేశాల మాజీలు కూడా తమ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాక్ మాజీ దిగ్గజం రమీజ్ రజా మాత్రం భారత్ ఫేవరెట్ అని చెబుతూ.. పాక్కు కూడా అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ‘‘దాయాదుల మధ్య పోరు భారీగానే ఉంటుంది. అయితే ఇక్కడ భారత్ ఫేవరెట్ అనడంలో అనుమానం లేదు. మూడు విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లోనూ చక్కటి ప్రదర్శన చేస్తోంది. అయితే, పాకిస్థాన్ కూడా విజయం సాధించేందుకు అవకాశం ఉంది. శ్రీలంకపై భారీ లక్ష్యఛేదన చేసిన తర్వాత పాక్ జట్టులోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రమీజ్ రజా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్