ODI WC 2023: వరల్డ్ కప్లో తుది జట్టు ఎంపికే అతిపెద్ద సవాల్..: రవిశాస్త్రి
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సంగ్రామం ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో అంకురార్పణ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ (ODI WC 2023) కోసం బరిలోకి దిగే జట్లకు అతి పెద్ద సవాల్ ‘ఫైనల్ XI’ను ఎంపిక చేసుకోవడమేనని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అయితే, టీమ్ఇండియా కూడా ఇదే సమస్యను ఎదుర్కోనుందని పేర్కొన్నాడు. గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్లో తలపడనుంది. అయితే, తుది జట్టులో మాత్రం కుల్దీప్ యాదవ్కు (Kuldeep Yadav) చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువని రవిశాస్త్రి తెలిపాడు. ఫైనల్ XIలో కుల్దీప్ ఉండాలంటే మాత్రం ఇతర బౌలర్ల ప్రదర్శనపైన ఆధారపడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
‘‘జట్టు కోసం ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. స్క్వాడ్లో అశ్విన్ చేరడంతో తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తే.. తర్వాతి మ్యాచుల్లో స్థానం సుస్థిరం కాదు. అయితే, కుల్దీప్ బౌలింగ్పై ఎలాంటి సందేహాలు లేవు. అద్భుతమైన బౌలర్. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్దీప్ ఇటీవల సిరీసుల్లో నాణ్యమైన బౌలింగ్ వేశాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే బరిలోకి దిగాలి. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం లభిస్తుంది. ఎలాగూ హార్దిక్ పాండ్య రూపంలో పేస్ ఆల్రౌండర్ ఉన్నాడు’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
అత్యధిక వికెట్లు తీసేది అతడే: ఇర్ఫాన్
కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో అవకాశంపై రవిశాస్త్రి వెల్లడించిన అభిప్రాయాలకు భిన్నంగా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఈ వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసే బౌలర్ కుల్దీప్ అవుతాడని జోస్యం చెప్పాడు. ఇర్ఫాన్ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, వినయ్ కుమార్, మిథాలీ రాజ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఆసియా కప్లోనూ కుల్దీప్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ