రసవత్తరంగా ‘సెమీస్’ పోరు.. అయితే ఫైనల్లో భారత్తో తలపడేది ఈ జట్టే: పాంటింగ్
సూపర్ 12 మ్యాచ్లు చివరి దశకు చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పటి వరకు కివీస్ మాత్రమే సెమీస్ బెర్తును ఖరారు చేసుకొంది. మిగతా బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఫైనల్కు చేరే జట్లేవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.
ఇంటర్నెట్డెస్క్ : పొట్టి ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 12 మ్యాచ్లు చివరి దశకు చేరుకుంటున్నాయి. గ్రూప్ -1 నుంచి న్యూజిలాండ్ దాదాపు సెమీస్ బెర్తు ఖరారు చేసుకొన్నట్లే. ప్రస్తుతం గ్రూప్ -1లో 7 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్ర స్థానంలో ఉండగా.. గ్రూప్ - 2 నుంచి టీమ్ ఇండియా 6 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధిస్తే అగ్రస్థానంతో సెమీస్ చేరుకొంటుంది. అయితే మిగతా రెండు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య సెమీస్ పోరు హోరాహోరీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఫైనల్కు చేరే జట్లేవో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంచనా వేశాడు.
‘నిజాయతీగా చెప్పాలంటే.. మెల్బోర్న్(ఫైనల్ మ్యాచ్ వేదిక)లో ఎవరు ఆడబోతున్నారో ఎవరికి తెలుసు..? గ్రూప్ దశను అధిగమించి ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుతుందని నేను ఆశిస్తున్నా. ఇక దక్షిణాప్రికా డేంజరస్ జట్టే అయినా.. నేను గతంలో చెప్పినట్లే ఫైనల్ మాత్రం ఆసీస్, భారత్ల మధ్యే ఉంటుంది’ అని పాంటింగ్ ఐసీసీకి రాసిన తాజా కాలమ్లో విశ్లేషించాడు.
‘అస్ట్రేలియా కొన్ని విభాగాల్లో వెనకబడి ఉంది.. రోహిత్ సేన కూడా బుమ్రాను కోల్పోయింది.. అయితే, ఈ మెగా టోర్నీ రెండో భాగంలో అత్యుత్తమ క్రికెట్ను ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్లు జట్లు ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి’ అని పాంటింగ్ వివరించాడు.
ఇక నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు తాను మెల్బోర్న్ వెళ్తున్నట్లు పాంటింగ్ తెలిపాడు. అందుకోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?