IND vs PAK: అలాంటి వారు ఈ మ్యాచ్ చూడొద్దన్న అక్తర్.. ప్రీ-మ్యాచ్ షో సిద్ధం!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) శనివారం హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో దాయాదుల పోరు (IND vs PAK) సందర్భంగా షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా మ్యాచ్ను బాయ్కాట్ చేయాలంటే సోషల్ మీడియాలో కొందరు చేసిన ట్వీట్లు వైరల్గా మారాయి. ఇక భారత్ - పాక్ పోరు ప్రారంభానికి ముందు ప్రీ మ్యాచ్ షోను నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వీరే
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏర్పాట్లను కూడా చేసేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. దాదాపు 1.20 లక్షలకుపైగా అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించనున్నట్లు సమాచారం. దీంతో వారిని ఎంటర్టైన్ చేసేందుకు సింగర్లు అర్జిత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్విందర్ సింగ్తో ప్రదర్శనలను సిద్ధం చేసింది. మ్యాచ్ శనివారం రెండు గంటలకు ప్రారంభం కానుంది. అయితే సంగీత కార్యక్రమాలు మాత్రం 12.30 గంటలకు మొదలవుతాయి.
ధైర్యవంతులైతేనే మ్యాచ్ను చూడండి: అక్తర్
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ను చూడాలంటే దమ్ము ఉండాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘‘మీరు ధైర్యవంతులైతే.. ఈ పోరును ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు పిరికివాళ్లైతే ఈ మ్యాచ్ను చూడకపోవడమే ఉత్తమం. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే సూపర్ స్టార్లుగా మారేందుకు ఇదొక చక్కటి అవకాశం. పాకిస్థాన్పై తీవ్ర ఒత్తిడి ఉంటుందనేది అవాస్తవం. భారత్ను ఫేవరెట్గా పరిగణించడం వల్ల పాక్పై ఒత్తిడి లేకుండా పోతుంది’’ అని అక్తర్ పేర్కొన్నాడు.
‘బాయ్కాట్’ చేయాలంటూ పోస్టులు..
భారత్ - పాక్ మ్యాచ్ను ‘బాయ్కాట్’ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అనుకూలంగా వ్యవహరిస్తోందని.. అలాంటి జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. గత నెలలో కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన మేజర్, డిప్యూటీ సూపరింటెండెంట్ను ఉగ్రవాదులు హత్య చేశారని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లకు ఇక్కడ ఘనస్వాగతం పలికితే.. ఆ దేశానికి చెందిన వారు మాత్రం ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘‘మన సైనికులు పాక్ బోర్డర్లో వీరోచితంగా పోరాడుతుంటే.. ఇక్కడ బీసీసీఐ మాత్రం పాక్ జట్టుకు గౌరవం ఇస్తూ ఆహ్వానం పలకడం సరైంది కాదు’’ అని ఓ నెటిజన్ ఆక్షేపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య