IND vs AUS: స్మిత్ వికెట్ కీలకమన్న జడ్డూ... మరో 50 పరుగులు చేయాల్సిందన్న కమిన్స్!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో (IND vs AUS) బోణీ కొట్టింది. స్టీవ్ స్మిత్ వికెట్ తీయడమే టర్నింగ్ పాయింట్గా రవీంద్ర జడేజా పేర్కొన్నాడు. తమ జట్టు మరో 50 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఆసీస్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి విజయం సాధించడం మరింత ఊపునిస్తుందని భారత సారథి వ్యాఖ్యానించాడు. భారత్ - ఆసీస్ మ్యాచ్కు సంబంధించిన మరికొన్ని విశేషాలు మీ కోసం..
కొత్త బ్యాటర్కు కఠిన సవాలే: రవీంద్ర జడేజా
చెన్నై వేదికపై భారత బౌలర్ రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 28 పరుగులే ఇచ్చాడు. అన్నింటికంటే ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను బౌల్డ్ చేయడమే ‘టర్నింగ్’ పాయింట్ అని జడేజా తెలిపాడు. ‘‘ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం చాలా కష్టం. బంతి టర్న్తోపాటు బౌన్స్ అవుతుంది. అలాంటి బాల్కే స్టీవ్ స్మిత్ను బౌల్డ్ చేశా. అప్పటి నుంచి మ్యాచ్ టర్నింగ్ అయింది. ఆ తర్వాత వచ్చిన కొత్త బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా కష్టం. అందుకే, స్మిత్ వికెట్టే టర్నింగ్ పాయింట్ అని చెబుతా. ఇక్కడే దాదాపు పదేళ్ల నుంచి ఆడుతూనే ఉన్నా. చెన్నై పిచ్ పరిస్థితిపై పూర్తి అవగాహన ఉంది. జట్టు కోసం నేనందించిన భాగస్వామ్యంపై సంతోషంగా ఉన్నా. ఇక ఛేదనలో మూడు వికెట్లు వెంటవెంటనేపడిపోయినప్పుడు ఎలాంటి జట్టుకైన కాస్త కంగారు ఉంటుంది. కానీ, విరాట్-కేఎల్ పార్టనర్షిప్ భారత్ను గెలిపించింది’’ అని జడేజా వెల్లడించాడు.
200 టార్గెట్ను కాపాడటం కష్టమే.. కానీ: కమిన్స్
‘‘ఈ పిచ్పై పరుగులు చేయడం చాలా క్లిష్టంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు కనీసం మరో 50 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, భారత బౌలింగ్ ఎటాక్ మమ్మల్ని అడ్డుకోవడం వల్ల సాధ్యపడలేదు. తర్వాత మా బౌలర్లూ అద్భుత ఆరంభం ఇచ్చారు. అయితే, ఒక స్పిన్నర్ తక్కువగా ఉన్నాడనే వాదన సరికాదు. మాకు 20 ఓవర్ల స్పిన్ బౌలింగ్ అందుబాటులో ఉంది. అయితే, విరాట్ కోహ్లీ క్యాచ్ను జారవిడవడం ఇబ్బంది కలిగించింది. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎప్పుడో వదిలేశా. ఒకవేళ అది సాధ్యమై ఉంటే 4/10తో డ్రీమ్ స్టార్ట్ లభించేది. హేజిల్ వుడ్ క్లాస్ బౌలర్. తప్పకుండా మా ఓటమిపై సమీక్షించుకుంటాం. తొమ్మిదింట్లో ఒకటే ముగిసింది. కాబట్టి, ఎలాంటి కంగారు లేదు. టాస్ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
వారిద్దరిదే ఈ విజయం: రోహిత్ శర్మ
‘‘విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. క్లిష్టపరిస్థితుల్లో నుంచి బయటపడి మరీ గెలవడం బాగుంది. టోర్నీ ప్రారంభం.. ఇలాంటి మ్యాచ్తో రావడం మేలు చేసేదే. ఫీల్డింగ్, బౌలింగ్ విషయాల్లో ప్రతి ఒక్కరి నుంచి భాగస్వామ్యం ఉంది. ఇలాంటి పిచ్పై పరుగులు చేయడం కష్టమే. మా బౌలర్లు పరిస్థితులను చక్కగా వినియోగించుకున్నారు. ఛేదనలో మాకు ఇలాంటి స్టార్టింగ్ రాకుండా ఉంటే బాగుండేది. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదేసమయంలో చెత్త షాట్లతో వికెట్లను సమర్పించాం. పవర్ప్లేలో ఎక్కువగా పరుగులు చేయాలనే క్రమంలోనే ఇలా జరిగింది. అయితే, విరాట్ కోహ్లీతోపాటు కేఎల్ రాహుల్దే ఈ విజయం. వారిద్దరూ పరిస్థితులకు అలవాటు పడి మరీ జట్టును గెలిపించారు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్